ETV Bharat / international

దిల్లీ-లాహోర్ బస్సుకు బ్రేక్​ వేసిన పాక్​

దిల్లీ-లాహోర్​ బస్సు సర్వీసును నిలివేసింది పాకిస్థాన్​. జమ్ము కశ్మీర్​ విభజన, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది పొరుగు దేశం.

author img

By

Published : Aug 10, 2019, 4:43 PM IST

దిల్లీ-లాహోర్ బస్సుకు బ్రేక్​ వేసిన పాక్​

జమ్ముకశ్మీర్​కు​ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో భారత్​తో ద్వైపాక్షిక బంధాన్ని తెంచే దిశలో చర్యలు ముమ్మరం చేసింది పాకిస్థాన్​. ఇప్పటికే రెండు సరిహద్దు రైళ్లను నిలిపివేసిన పాక్​... తాజాగా దిల్లీ-లాహోర్​ ఫ్రెండ్​షిప్ బస్సు సర్వీసును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఈ బస్సు సర్వీసు పూర్తిగా నిలిచిపోనుంది.

"జాతీయ భద్రతాకమిటీ (ఎన్​ఎస్​సీ) నిర్ణయం ప్రకారం భారత్​-పాక్​ మధ్య నడిచే బస్సు సర్వీసులను సోమవారం నుంచి నిలిపివేస్తున్నాం."
- మురద్​ సయీద్​, పాక్​ కమ్యునికేషన్స్, పోస్టల్ సర్వీసెస్​ మంత్రి ట్వీట్​

1999 ఫిబ్రవరిలో దిల్లీ-లాహోర్​ మధ్య ఫ్రెండ్​షిప్​ బస్సు సర్వీసు ప్రారంభమైంది. 2001 పార్లమెంట్​పై ఉగ్రవాదుల దాడి అనంతరం దానిని నిలిపివేశారు. 2003 జులైలో ఈ బస్సు సర్వీసు పునరుద్ధరించారు.

ఇలా సర్వీసులు నడుస్తాయ్..

ఇండియా గేట్​ సమీపంలోని అంబేడ్కర్ స్టేడియం టెర్మినల్ నుంచి ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో దిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) బస్సులు లాహోర్​ వెళ్తాయి. తిరిగి లాహోర్​ నుంచి దిల్లీకి ప్రతి మంగళ, గురు, శనివారాల్లో బయలుదేరతాయి.

పాకిస్థాన్ టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్​ కూడా బస్సు సర్వీసు నడుపుతోంది. ఈ బస్సులు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో దిల్లీ నుంచి లాహోర్​కు పయనమవుతాయి. తిరిగి దిల్లీకి సోమ, బుధ, శుక్రవారాల్లో బయలుదేరతాయి.

ఇదీ చూడండి: హువావేతో అమెరికా వ్యాపారం పూర్తిగా బంద్​

జమ్ముకశ్మీర్​కు​ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో భారత్​తో ద్వైపాక్షిక బంధాన్ని తెంచే దిశలో చర్యలు ముమ్మరం చేసింది పాకిస్థాన్​. ఇప్పటికే రెండు సరిహద్దు రైళ్లను నిలిపివేసిన పాక్​... తాజాగా దిల్లీ-లాహోర్​ ఫ్రెండ్​షిప్ బస్సు సర్వీసును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఈ బస్సు సర్వీసు పూర్తిగా నిలిచిపోనుంది.

"జాతీయ భద్రతాకమిటీ (ఎన్​ఎస్​సీ) నిర్ణయం ప్రకారం భారత్​-పాక్​ మధ్య నడిచే బస్సు సర్వీసులను సోమవారం నుంచి నిలిపివేస్తున్నాం."
- మురద్​ సయీద్​, పాక్​ కమ్యునికేషన్స్, పోస్టల్ సర్వీసెస్​ మంత్రి ట్వీట్​

1999 ఫిబ్రవరిలో దిల్లీ-లాహోర్​ మధ్య ఫ్రెండ్​షిప్​ బస్సు సర్వీసు ప్రారంభమైంది. 2001 పార్లమెంట్​పై ఉగ్రవాదుల దాడి అనంతరం దానిని నిలిపివేశారు. 2003 జులైలో ఈ బస్సు సర్వీసు పునరుద్ధరించారు.

ఇలా సర్వీసులు నడుస్తాయ్..

ఇండియా గేట్​ సమీపంలోని అంబేడ్కర్ స్టేడియం టెర్మినల్ నుంచి ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో దిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) బస్సులు లాహోర్​ వెళ్తాయి. తిరిగి లాహోర్​ నుంచి దిల్లీకి ప్రతి మంగళ, గురు, శనివారాల్లో బయలుదేరతాయి.

పాకిస్థాన్ టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్​ కూడా బస్సు సర్వీసు నడుపుతోంది. ఈ బస్సులు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో దిల్లీ నుంచి లాహోర్​కు పయనమవుతాయి. తిరిగి దిల్లీకి సోమ, బుధ, శుక్రవారాల్లో బయలుదేరతాయి.

ఇదీ చూడండి: హువావేతో అమెరికా వ్యాపారం పూర్తిగా బంద్​

AP Video Delivery Log - 0800 GMT News
Saturday, 10 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0627: Japan North Korea No access Japan 4224487
Japan defence official on NKorea missile launches
AP-APTN-0627: Saudi Arabia Mount Arafat AP Clients Only 4224489
Hajj pilgrims climb Mount Arafat to say prayers
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.