కరోనా వ్యాక్సిన్కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు ఇజ్రాయెల్ పరిశోధకులు. వైరస్లోని అణువులకు రోగ నిరోధక వ్యవస్థను ప్రతిస్పందింపజేసి యాంటీబాడీలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ అణువులను కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ఉపయోగించవచ్చని తెలిపారు.
ఇజ్రాయెల్లోని బార్ ఇలాన్ యూనివర్సిటీ(బీఐయూ) పరిశోధకుల అధ్యయనం ఎంపీడీఐ వ్యాక్సిన్స్ జర్నల్లో ప్రచురితమైంది. దీని ప్రకారం కరోనా వైరస్లోని ప్రతిజనక అణువులను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇవి రోగ నిరోధక ప్రతిస్పందనలో యాంటీబాడీలను ఉత్పత్తి చేయగలవు.
ప్రతిజనక అణువులోని ప్రోటీన్ ఏ స్థాయిలో ఉందో గుర్తించేందుకు బయోఇన్ఫర్మెటిక్స్ ఆధారిత గణన విధానాన్ని పాటించారు . రోగ నిరోధక వ్యవస్థను ప్రతిస్పందింపజేసే మొత్తం 25 ఎపిటోప్లను వైరస్లోని ప్రోటీన్లలో గుర్తించారు.
ప్రపంచవ్యాప్తంగా వైరస్ ప్రభావిత జనాభాలో 87 శాతానికి పైగా ఏడు ఎపిటోప్లు ఉన్నట్లు పరిశోధన బృందం తెలిపింది. బహుళ సాధనాల ద్వారా వీటిని పరీక్షించినట్లు పేర్కొంది. వ్యాక్సిన్ అభివృద్ధికి ఇవి సమర్థంగా పనిచేస్తాయని వివరించింది.