ETV Bharat / international

'మసూద్​ అజార్​ను పాక్ సురక్షితంగా​ దాచిపెట్టింది'

author img

By

Published : Feb 18, 2020, 2:14 PM IST

Updated : Mar 1, 2020, 5:34 PM IST

జైషే మహ్మద్​ అధినేత మసూద్ అజార్ అదృశ్యమయ్యాడని పాక్​ చెబుతున్న మాటలు అవాస్తవమని భారత నిఘా వర్గాలు తెలిపాయి. స్వయంగా పాక్​ ఆర్మీ, ఐఎస్​ఐ కలిసి అజార్​ను అత్యంత సురక్షితమైన ప్రదేశంలో దాచినట్లు పేర్కొన్నాయి.

Indian intelligence sources say Pakistan has hid Masood Azhar
'మసూద్​ అజార్​ను పాక్ సురక్షితంగా​ దాచిపెట్టింది'

పాకిస్థాన్​ చెబుతున్నట్లు జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ అదృశ్యమవ్వలేదని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. స్వయంగా పాకిస్థాన్ ఆర్మీ‌, ఐఎస్‌ఐ కలిసి అజార్‌ను అత్యంత భద్రమైన ప్రదేశంలో దాచారని పేర్కొన్నాయి. పాక్​లోని బహవల్‌పూర్‌లో ఓ బుల్లెట్‌ ప్రూఫ్‌ ఇంట్లో అజార్‌ సురక్షితంగా దాక్కొన్నట్లు తమకు సమాచారం ఉందని తెలిపాయి.

కంటితుడుపు చర్యలకు దిగిన పాక్​..

పాక్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలా వద్దా అన్న అంశంపై ఆర్థికచర్యల కార్యదళం-ఎఫ్​ఏటీఎఫ్​ ఈ వారంలో కీలకనిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో కంటితుడుపు చర్యలకు దిగిన పాక్‌.. ఇటీవలే లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌కు రెండు కేసుల్లో 11ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే సమయంలో జైషే అగ్రనేత మసూద్‌ అజార్‌ కొంత కాలం నుంచి కనిపించట్లేదంటూ ప్రకటన చేసింది. మసూద్‌ అజార్‌ దేశం విడిచి పారిపోయాడంటూ పాక్‌ ఆర్థిక వ్యవహారాల మంత్రి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే పాక్‌ అందులో ఎలాంటి వాస్తవం లేదని.. ఎఫ్​ఏటీఎఫ్​ సమావేశం నేపథ్యంలో అజార్‌, అతడి కుటుంబసభ్యులను ఓ భద్రమైన ఇంట్లో దాచిపెట్టారని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి.

పాకిస్థాన్​ చెబుతున్నట్లు జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ అదృశ్యమవ్వలేదని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. స్వయంగా పాకిస్థాన్ ఆర్మీ‌, ఐఎస్‌ఐ కలిసి అజార్‌ను అత్యంత భద్రమైన ప్రదేశంలో దాచారని పేర్కొన్నాయి. పాక్​లోని బహవల్‌పూర్‌లో ఓ బుల్లెట్‌ ప్రూఫ్‌ ఇంట్లో అజార్‌ సురక్షితంగా దాక్కొన్నట్లు తమకు సమాచారం ఉందని తెలిపాయి.

కంటితుడుపు చర్యలకు దిగిన పాక్​..

పాక్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలా వద్దా అన్న అంశంపై ఆర్థికచర్యల కార్యదళం-ఎఫ్​ఏటీఎఫ్​ ఈ వారంలో కీలకనిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో కంటితుడుపు చర్యలకు దిగిన పాక్‌.. ఇటీవలే లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌కు రెండు కేసుల్లో 11ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే సమయంలో జైషే అగ్రనేత మసూద్‌ అజార్‌ కొంత కాలం నుంచి కనిపించట్లేదంటూ ప్రకటన చేసింది. మసూద్‌ అజార్‌ దేశం విడిచి పారిపోయాడంటూ పాక్‌ ఆర్థిక వ్యవహారాల మంత్రి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే పాక్‌ అందులో ఎలాంటి వాస్తవం లేదని.. ఎఫ్​ఏటీఎఫ్​ సమావేశం నేపథ్యంలో అజార్‌, అతడి కుటుంబసభ్యులను ఓ భద్రమైన ఇంట్లో దాచిపెట్టారని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి.

Last Updated : Mar 1, 2020, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.