ETV Bharat / international

కరోనా ఎఫెక్ట్​: నిర్బంధంలో పలు హోటళ్లు

author img

By

Published : Feb 26, 2020, 6:59 AM IST

Updated : Mar 2, 2020, 2:40 PM IST

చైనాతో పాటు ప్రపంచ దేశాల్లోనూ కరోనా వేగంగా విజృంభిస్తోంది. ఆస్ట్రియా రాజధాని ఇన్స్​బర్క్​లోని ఓ హోటల్​ రిసెప్షనిస్ట్​కు ఈ వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు. స్పెయిన్​లోని టెనెరిఫె హోటల్​లో బస చేసిన ఇటాలియన్​ ప్రయాణికుడికీ కరోనా సంక్రమించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో ఆ హోటళ్లను నిర్బంధించారు. అత్యవసరమైతే తప్ప గదుల నుంచి బయటకు రావద్దని సూచించారు.

Hundreds of tourists in Tenerife hotel lockdown over coronavirus
కరోనా ఎఫెక్ట్​: నిర్బంధంలో పలు హోటళ్లు

కరోనా.. ప్రస్తుతం ఈ పేరు వినగానే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనాలో నానాటికి కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే ఇతర దేశాల్లో మాత్రం పెరిగిపోతున్నాయి. తాజాగా ఆస్ట్రియా రాజధాని ఇన్స్​బర్క్​లోని ఓ హోటల్లో రిసెప్షనిస్ట్​గా పని చేస్తున్న ఓ మహిళకు వైరస్​ సోకినందుకు ఈ హోటల్​ను నిర్బంధించారు అధికారులు.

అనంతరం ఆమె భర్తకూ వైరస్ సంక్రమించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీరిరువురికీ ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు.

స్పెయిన్​లో...

స్పెయిన్​లో 100 మంది ఇటలీ ప్రయాణికులను అధికారులు హోటల్​ గదులకే పరిమితం చేశారు. ఇటలీలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటలీకి చెందిన ఓ ప్రయాణికుడు ఇటీవల టెనెరెఫే హోటల్​లో బస చేసిన కారణంగా వీరిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు వివరించారు.

ఇప్పటి వరకు స్పెయిన్​లో రెండు కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు కేసులు విదేశీ పర్యటకుల్లోనే కావటం గమనార్హం.

ఇటలీలో ఇప్పటివరకు కరోనా ధాటికి ఏడుగురు మరణించారు. ఈ వైరస్​ కారణంగా చైనాలో 2600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: 80వేలు దాటిన కరోనా కేసులు- దక్షిణ కొరియాలో విజృంభణ

కరోనా.. ప్రస్తుతం ఈ పేరు వినగానే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనాలో నానాటికి కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే ఇతర దేశాల్లో మాత్రం పెరిగిపోతున్నాయి. తాజాగా ఆస్ట్రియా రాజధాని ఇన్స్​బర్క్​లోని ఓ హోటల్లో రిసెప్షనిస్ట్​గా పని చేస్తున్న ఓ మహిళకు వైరస్​ సోకినందుకు ఈ హోటల్​ను నిర్బంధించారు అధికారులు.

అనంతరం ఆమె భర్తకూ వైరస్ సంక్రమించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీరిరువురికీ ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు.

స్పెయిన్​లో...

స్పెయిన్​లో 100 మంది ఇటలీ ప్రయాణికులను అధికారులు హోటల్​ గదులకే పరిమితం చేశారు. ఇటలీలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటలీకి చెందిన ఓ ప్రయాణికుడు ఇటీవల టెనెరెఫే హోటల్​లో బస చేసిన కారణంగా వీరిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు వివరించారు.

ఇప్పటి వరకు స్పెయిన్​లో రెండు కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు కేసులు విదేశీ పర్యటకుల్లోనే కావటం గమనార్హం.

ఇటలీలో ఇప్పటివరకు కరోనా ధాటికి ఏడుగురు మరణించారు. ఈ వైరస్​ కారణంగా చైనాలో 2600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: 80వేలు దాటిన కరోనా కేసులు- దక్షిణ కొరియాలో విజృంభణ

Last Updated : Mar 2, 2020, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.