ETV Bharat / international

'370, సీఏఏ'.. భారత అంతర్గత అంశాలే: మాల్దీవులు

author img

By

Published : Jan 19, 2020, 4:58 PM IST

కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం.. రెండూ భారత అంతర్గత అంశాలని మాల్దీవులు అభిప్రాయపడింది. ఈ  విషయాలను పొరుగు దేశాలు ఆక్షేపించేందుకు అవకాశం లేదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్..​ 'ఈటీవీ భారత్' ముఖాముఖిలో వెల్లడించారు.

Exclusive Maldives Abdullah Shahid ETV Bharat
'370', సీఏఏ.. భారత అంతర్గత అంశాలే: మాల్దీవులు

కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి రద్దు సహా పౌరసత్వ చట్ట సవరణ విషాయాల్లో భారత ప్రభుత్వ నిర్ణయాన్ని మాల్దీవులు సమర్థించింది. ఈ రెండు అంశాలు నూటికి నూరు శాతం భారత అంతర్గత విషయాలని తేల్చిచెప్పారు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్. 'ఈటీవీ భారత్'​ ప్రత్యేక ముఖాముఖిలో భారత్​-మాల్దీవుల సంబంధాలపైనా పలు కీలక వ్యాఖ్యలు చేశారు షాహిద్​.

కశ్మీర్​ అంశం పూర్తిగా భారత అంతర్గత విషయమని.. ఇందులో తమతో సహా ఏ ఇతర దేశాలు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదన్నారు షాహిద్​. ఇటీవల జమ్ముకశ్మీర్​ను సందర్శించిన విదేశీ రాయబారుల్లో షాహిద్​ ఒకరు. కశ్మీర్​లో ప్రస్తుత క్షేత్ర పరిస్థితులపై షాహిద్​ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తుందని అభిప్రాయపడ్డారు.

'370', సీఏఏ.. భారత అంతర్గత అంశాలే: మాల్దీవులు

భారత విదేశాంగ మంత్రి జయ్​శంకర్​తో ఇరు దేశాల సంబంధాలపై దిల్లీలో కీలక చర్చలు జరిపినట్లు తెలిపారు. సీఏఏపై భారత్​లో జరుగుతోన్న నిరసనలపై.. స్పందిస్తూ ఇది భారత మౌలిక సూత్రం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా అభివర్ణించారు.

భారత్​ మద్దతుతో మాల్దీవులలో క్రికెట్​ మైదానం నిర్మాణం అవుతుందని.. ఒకసారి ఇది పూర్తయితే తాము.. టీమిండియాను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి రద్దు సహా పౌరసత్వ చట్ట సవరణ విషాయాల్లో భారత ప్రభుత్వ నిర్ణయాన్ని మాల్దీవులు సమర్థించింది. ఈ రెండు అంశాలు నూటికి నూరు శాతం భారత అంతర్గత విషయాలని తేల్చిచెప్పారు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్. 'ఈటీవీ భారత్'​ ప్రత్యేక ముఖాముఖిలో భారత్​-మాల్దీవుల సంబంధాలపైనా పలు కీలక వ్యాఖ్యలు చేశారు షాహిద్​.

కశ్మీర్​ అంశం పూర్తిగా భారత అంతర్గత విషయమని.. ఇందులో తమతో సహా ఏ ఇతర దేశాలు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదన్నారు షాహిద్​. ఇటీవల జమ్ముకశ్మీర్​ను సందర్శించిన విదేశీ రాయబారుల్లో షాహిద్​ ఒకరు. కశ్మీర్​లో ప్రస్తుత క్షేత్ర పరిస్థితులపై షాహిద్​ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తుందని అభిప్రాయపడ్డారు.

'370', సీఏఏ.. భారత అంతర్గత అంశాలే: మాల్దీవులు

భారత విదేశాంగ మంత్రి జయ్​శంకర్​తో ఇరు దేశాల సంబంధాలపై దిల్లీలో కీలక చర్చలు జరిపినట్లు తెలిపారు. సీఏఏపై భారత్​లో జరుగుతోన్న నిరసనలపై.. స్పందిస్తూ ఇది భారత మౌలిక సూత్రం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా అభివర్ణించారు.

భారత్​ మద్దతుతో మాల్దీవులలో క్రికెట్​ మైదానం నిర్మాణం అవుతుందని.. ఒకసారి ఇది పూర్తయితే తాము.. టీమిండియాను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.