ETV Bharat / international

మరో కీలక ఘట్టం పూర్తి- 'చాంగే-5' తిరుగుప్రయాణం

author img

By

Published : Dec 6, 2020, 1:41 PM IST

చైనా ప్రతిష్టాత్మక మిషన్​ చాంగే-5లో మరో కీలక ఘట్టం ముగిసింది. చంద్రుడి ఉపరితలంపై మట్టి, రాళ్ల నమూనాలను సేకరించిన అసెండర్​.. ఆదివారం ఆర్బిటర్​తో అనుసంధానమైంది. ఆ నమూనాలను విజయవంతంగా ఆర్బిటర్​లోకి చేర్చింది. ఇక సరైన సమయం చూసుకుని భూమికి తిరిగివచ్చేందుకు ఎదురుచూస్తోంది చాంగే-5.

Chinese Chang'e 5 probe completes docking mission, set to return moon rocks to Earth
'చాంగే-5'లో మరో కీలక ఘట్టం పూర్తి
ఆర్బిటర్​తో అసెండర్​ అనుసంధానం

జాబిల్లి ఉపరితలంపై సేకరించిన రాళ్ల నమూనాలను.. ఆర్బిటర్​కు చాంగే-5 చేర్చినట్టు ఆదివారం చైనా ప్రకటించింది. ఆదివారం ఉదయం ఈ 'డాకింగ్​' ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్టు పేర్కొంది సీఎన్​ఎస్​ఏ(చైనా నేషనల్​ స్పేస్​ అడ్మినిస్ట్రేషన్​).

నవంబర్​ 24న ఈ చాంగే-5ను ప్రయోగించింది చైనా. ఇందులో ఆర్బిటర్​, అసెండర్​, ల్యాండర్​, రిటర్నర్​ అని నాలుగు భాగాలున్నాయి. ఆర్బిటర్​- రిటర్నర్​ భాగం చంద్రుడి కక్ష్యలోనే ఉండిపోగా.. ఈ నెల 1న ల్యాండర్​-అసెండర్​ జాబిల్లిపై కాలిమోపింది. చంద్రుడిపై దిగి, మట్టి, శిలలను సేకరించి తిరిగి అసెండర్​ భాగం శుక్రవారం నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం అర్బిటర్​ ఉన్న కక్ష్యలోకి చేరుకుంది. తాజాగా.. చైనా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6:12కు అర్బిటర్​తో అనుసంధానమైంది అసెండర్​. రైళ్ల నమూనాలను చేర్చింది.

ఇదీ చూడండి:- జాబిల్లిపై జాతీయ జెండా పాతిన చైనా

అసెండర్​ నుంచి విడిపోయి భూమికి తిరిగివచ్చేందుకు ఆర్బిటర్​-రిటర్నర్​ భాగం సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది.

చైనా చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టుల్లో చాంగే-5 ఒకటి. ఈ నెలలో మంగోలియాలో ఇది ల్యాండ్​ అయ్యే అవకాశముంది.

ఇదీ చూడండి:- ప్రపంచంలోనే వేగవంతమైన కంప్యూటర్​- 'జియూఝాంగ్'​

ఆర్బిటర్​తో అసెండర్​ అనుసంధానం

జాబిల్లి ఉపరితలంపై సేకరించిన రాళ్ల నమూనాలను.. ఆర్బిటర్​కు చాంగే-5 చేర్చినట్టు ఆదివారం చైనా ప్రకటించింది. ఆదివారం ఉదయం ఈ 'డాకింగ్​' ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్టు పేర్కొంది సీఎన్​ఎస్​ఏ(చైనా నేషనల్​ స్పేస్​ అడ్మినిస్ట్రేషన్​).

నవంబర్​ 24న ఈ చాంగే-5ను ప్రయోగించింది చైనా. ఇందులో ఆర్బిటర్​, అసెండర్​, ల్యాండర్​, రిటర్నర్​ అని నాలుగు భాగాలున్నాయి. ఆర్బిటర్​- రిటర్నర్​ భాగం చంద్రుడి కక్ష్యలోనే ఉండిపోగా.. ఈ నెల 1న ల్యాండర్​-అసెండర్​ జాబిల్లిపై కాలిమోపింది. చంద్రుడిపై దిగి, మట్టి, శిలలను సేకరించి తిరిగి అసెండర్​ భాగం శుక్రవారం నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం అర్బిటర్​ ఉన్న కక్ష్యలోకి చేరుకుంది. తాజాగా.. చైనా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6:12కు అర్బిటర్​తో అనుసంధానమైంది అసెండర్​. రైళ్ల నమూనాలను చేర్చింది.

ఇదీ చూడండి:- జాబిల్లిపై జాతీయ జెండా పాతిన చైనా

అసెండర్​ నుంచి విడిపోయి భూమికి తిరిగివచ్చేందుకు ఆర్బిటర్​-రిటర్నర్​ భాగం సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది.

చైనా చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టుల్లో చాంగే-5 ఒకటి. ఈ నెలలో మంగోలియాలో ఇది ల్యాండ్​ అయ్యే అవకాశముంది.

ఇదీ చూడండి:- ప్రపంచంలోనే వేగవంతమైన కంప్యూటర్​- 'జియూఝాంగ్'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.