ETV Bharat / international

అమెరికా తీరు మార్చుకోకపోతే.. ప్రతీకార చర్య తప్పదు

చైనాకు చెందిన మరో నాలుగు మీడియా సంస్థలను 'విదేశీ మిషన్స్'​ జాబితాలో అమెరికా చేర్చటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది డ్రాగన్​ దేశం. ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని మానుకొని తప్పుడు పద్ధతులను మార్చుకోవాలని హితవు పలికింది. తీరు మార్చకోకపోతే.. తగిన ప్రతీకార చర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించింది.

author img

By

Published : Jun 24, 2020, 12:38 PM IST

China warns US over actions against 4 more media outlets
అమెరికా తీరు మార్చుకోకపోతే.. ప్రతీకార చర్యలు: చైనా

అమెరికా-చైనాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా అమెరికాలోని మరో నాలుగు చైనా మీడియా సంస్థలను 'విదేశీ మిషన్స్​' జాబితాలో చేర్చటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది బీజింగ్​. అగ్రరాజ్యం తీరు మార్చుకోకుంటే ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ పరిపాలనా విభాగంపై​ విమర్శలు గుప్పించారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్​.

" చైనా మీడియాపై అమెరికా రాజకీయ అణచివేతకు తాజా నిర్ణయమే ఉదాహరణ. అది పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉన్న అమెరికా నిబద్ధతను కాలరాస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం, పక్షపాత ధోరణిని మానుకోవాలని అమెరికాను కోరుతున్నాం. ఎవరికీ ఉపయోగంలేని తప్పుడు పద్ధతిని వెంటనే ఆపి.. సరిదిద్దుకోవాలి. లేనిపక్షంలో అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది."

- ఝూవో లిజియాన్​, చైనా విదేశాంగ అధికార ప్రతినిధి.

మొత్తం 9సంస్థలపై..

విదేశీ మిషన్ల జాబితాలో ఇప్పటికే ఐదు చైనా సంస్థలను చేర్చిన అమెరికా.. తాజాగా మరో నాలుగింటిని చేర్చాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం నేరుగా జర్నలిజం సామర్థ్యాన్ని అడ్డుకోకపోయినా.. అమెరికాలోని సిబ్బందిని తగ్గించేందుకు ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఈ చర్యతో ఇరు దేశాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ఇదీ చూడండి: చైనా వెన్నుపోటు- నేపాల్​ భూభాగం దురాక్రమణ

అమెరికా-చైనాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా అమెరికాలోని మరో నాలుగు చైనా మీడియా సంస్థలను 'విదేశీ మిషన్స్​' జాబితాలో చేర్చటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది బీజింగ్​. అగ్రరాజ్యం తీరు మార్చుకోకుంటే ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ పరిపాలనా విభాగంపై​ విమర్శలు గుప్పించారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్​.

" చైనా మీడియాపై అమెరికా రాజకీయ అణచివేతకు తాజా నిర్ణయమే ఉదాహరణ. అది పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉన్న అమెరికా నిబద్ధతను కాలరాస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం, పక్షపాత ధోరణిని మానుకోవాలని అమెరికాను కోరుతున్నాం. ఎవరికీ ఉపయోగంలేని తప్పుడు పద్ధతిని వెంటనే ఆపి.. సరిదిద్దుకోవాలి. లేనిపక్షంలో అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది."

- ఝూవో లిజియాన్​, చైనా విదేశాంగ అధికార ప్రతినిధి.

మొత్తం 9సంస్థలపై..

విదేశీ మిషన్ల జాబితాలో ఇప్పటికే ఐదు చైనా సంస్థలను చేర్చిన అమెరికా.. తాజాగా మరో నాలుగింటిని చేర్చాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం నేరుగా జర్నలిజం సామర్థ్యాన్ని అడ్డుకోకపోయినా.. అమెరికాలోని సిబ్బందిని తగ్గించేందుకు ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఈ చర్యతో ఇరు దేశాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ఇదీ చూడండి: చైనా వెన్నుపోటు- నేపాల్​ భూభాగం దురాక్రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.