ETV Bharat / international

మసీదులో కాల్పులు- కుటుంబంలోని 8 మంది మృతి

author img

By

Published : Apr 18, 2021, 3:15 PM IST

Updated : Apr 18, 2021, 3:34 PM IST

అఫ్గానిస్థాన్​లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని కాల్చిచంపారు గుర్తుతెలియని సాయుధులు. మసీదు​లో ప్రార్థనలు చేస్తున్న సమయంలో వారిపై కాల్పులు జరిపినట్లు నంగర్​హర్​ రాష్ట్ర గవర్నర్ జియా ఉల్​ హక్​ తెలిపారు.

gun fire at mosque
మసీదులో కాల్పులు

అఫ్గానిస్థాన్​ నంగర్​హర్​ జలాలబాద్​ జిల్లాలో విషాదం జరిగింది. స్థానిక మసీదు​లో ప్రార్థనలు చేస్తున్న ఒకే కుటుంబంలోని ఎనిమిది మందిని కాల్చి చంపారు దుండగులు.

ప్రాథమిక నివేదిక ప్రకారం హాజీ అబ్దుల్ వహాబ్​.. ఐదుగురు కుమారులు, ముగ్గరు మేనల్లుళ్లు ఈ ఘటనలో మరణించినట్లు గుర్తించామని నంగర్​హర్​ గవర్నర్ జియా ఉల్​ హక్​ తెలిపారు. వ్యక్తిగత వివాదాలవల్లే.. దుండగులు వీరిపై కాల్పులు జరిపినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్​ చేయలేదన్నారు.

ఇటీవల.. హేరత్​లోని జిందాజన్​ జిల్లాలో జరిగిన కారు బాంబు ఘటనలో ముగ్గురు పోలీస్ అధికారులు మృతిచెందినట్లు టోలో వార్తాసంస్థ తెలిపింది.

ఇదీ చదవండి : ఇరాన్​లో 5.9 తీవ్రతతో భూకంపం

అఫ్గానిస్థాన్​ నంగర్​హర్​ జలాలబాద్​ జిల్లాలో విషాదం జరిగింది. స్థానిక మసీదు​లో ప్రార్థనలు చేస్తున్న ఒకే కుటుంబంలోని ఎనిమిది మందిని కాల్చి చంపారు దుండగులు.

ప్రాథమిక నివేదిక ప్రకారం హాజీ అబ్దుల్ వహాబ్​.. ఐదుగురు కుమారులు, ముగ్గరు మేనల్లుళ్లు ఈ ఘటనలో మరణించినట్లు గుర్తించామని నంగర్​హర్​ గవర్నర్ జియా ఉల్​ హక్​ తెలిపారు. వ్యక్తిగత వివాదాలవల్లే.. దుండగులు వీరిపై కాల్పులు జరిపినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్​ చేయలేదన్నారు.

ఇటీవల.. హేరత్​లోని జిందాజన్​ జిల్లాలో జరిగిన కారు బాంబు ఘటనలో ముగ్గురు పోలీస్ అధికారులు మృతిచెందినట్లు టోలో వార్తాసంస్థ తెలిపింది.

ఇదీ చదవండి : ఇరాన్​లో 5.9 తీవ్రతతో భూకంపం

Last Updated : Apr 18, 2021, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.