అఫ్గానిస్థాన్లో భారీ స్థాయిలో తాలిబన్ల ఊచకోత జరిగింది. 100మందికిపైగా ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో మరో 50 మంది తాలిబన్లు గాయపడ్డారని, పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అంతేకాక, మందు గుండు సామాగ్రిని కూడా ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.
24 గంటల వ్యవధిలో లాఘ్మన్, కునార్, నంగార్హర్, ఘాజ్ని, పాక్టియా, మైదాన్ వార్దక్, ఖోస్త్, జాబుల్, బగ్దీస్, హేరాత్, ఫర్యాబ్, హెల్మాండ్, బాగ్లన్ రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్లను నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టిన మైన్లను నిర్వీర్యం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
అఫ్గానిస్థాన్లో కొద్ది రోజులుగా హింస, తిరుగుబాటు పేట్రేగిపోతోంది. ఇప్పటివరకు ఈ దాడిపై తాలిబన్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భద్రతా చెక్పాయింట్లు, కాన్వాయ్లపై దాడులు ప్రారంభించినట్లు సమాచారం.
ఇదీ చూడండి: వ్యాన్పై బాంబు దాడి- నలుగురు లెక్చరర్లు మృతి