ఉత్తర చైనాలోని షాంక్సీ రాష్ట్రంలో ఓ రెస్టారెంటు భవనం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మంది గాయపడ్డారు. ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
లిన్ఫెన్ నగరంలోని జియాంగ్ఫెన్ ప్రాంతంలో ఉదయం 9:40 గంటల ప్రాంతంలో రెస్టారెంటు నిర్వహిస్తోన్న రెండంతస్తుల భవనం కూలిపోయినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ఇప్పటివరకు 45 మందిని బయటకుతీసినట్లు నివేదించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
భవనం కూలిపోయేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఇదీ చూడండి: జనాల మధ్యే కాదు.. ఎవరూలేని చోటా కరోనా!