ETV Bharat / international

'ట్రంప్ చేసింది చాలా పెద్ద తప్పు.. జాగ్రత్తగా ఉండాలి'

author img

By

Published : Jul 25, 2019, 1:08 PM IST

కశ్మీర్​పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి... అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ అతిపెద్ద దౌత్యపరమైన తప్పిదానికి పాల్పడ్డారని ప్రముఖ అమెరికన్ దినపత్రిక చురకలంటించింది. ఇలాంటి వ్యాఖ్యలతో భారత్​ను దూరం చేసుకుంటే భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది. చైనాను నిలువరించడానికి ఉన్న ఏకైక అవకాశాన్ని చేజేతులా నాశనం చేస్తున్నారని దుయ్యబట్టింది.

'ట్రంప్ చేసింది చాలా పెద్ద తప్పు.. జాగ్రత్తగా ఉండాలి'

కశ్మీర్​ సమస్యపై మధ్యవర్తిత్వం చేస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ దౌత్యపరంగా అతిపెద్ద తప్పిదానికి పాల్పినట్లేనని ఓ ప్రముఖ అమెరికన్​ దినపత్రిక పేర్కొంది. భారత్​తో సంబంధాల్లో పూర్వ అధ్యక్షులు సాధించిన విజయాలను ట్రంప్ నీరుగారుస్తున్నారని మండిపడింది.

మోదీ అడిగారు

జపాన్ ఒసాకాలో జరిగిన జీ-20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీ... కశ్మీర్ అంశంలో తనను మధ్యవర్తిగా ఉండి, సహాయం చేయమని కోరారని ట్రంప్ పేర్కొన్నారు.

అంతలేదు

ట్రంప్ వ్యాఖ్యలను భారత్​ ఖండించింది. కశ్మీర్​ విషయంలో సహాయం చేయమని ట్రంప్​ను మోదీ కోరలేదని స్పష్టం చేసింది. 'కశ్మీర్'​ పూర్తిగా భారత్​, పాక్​ల ద్వైపాక్షిక సమస్య అని, చర్చల ద్వారా తామే తేల్చుకుంటామని తేల్చిచెప్పింది. ఇదే విషయాన్ని పార్లమెంట్​లో విదేశాంగమంత్రి జైశంకర్​ స్పష్టం చేశారు.

భారత్​తో స్నేహానికి గండి

అమెరికన్ దిగుమతులపై భారత్​ అధికంగా సుంకాలు విధిస్తోందంటూ భారత్​పైనా వాణిజ్య యుద్ధానికి తెరతీశారు ట్రంప్​. అది కాస్తా సద్దుమణిగింది అనుకునే లోపు.. ఇప్పుడు మధ్యవర్తిత్వం చేస్తానంటూ ప్రకటించి వివాదానికి కారణమయ్యారు. ఈ తప్పుడు చర్యలతో భారత్​ను దూరం చేసుకుని.. చైనాను నిలువరించడానికి ఉన్న ఏకైక అవకాశాన్ని అమెరికా చేజార్చుకుంటోందని ఆ పత్రిక పేర్కొంది.

ఇదీ చూడండి: రాజీవ్ హత్యకేసు నిందితురాలు నళిని విడుదల

కశ్మీర్​ సమస్యపై మధ్యవర్తిత్వం చేస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ దౌత్యపరంగా అతిపెద్ద తప్పిదానికి పాల్పినట్లేనని ఓ ప్రముఖ అమెరికన్​ దినపత్రిక పేర్కొంది. భారత్​తో సంబంధాల్లో పూర్వ అధ్యక్షులు సాధించిన విజయాలను ట్రంప్ నీరుగారుస్తున్నారని మండిపడింది.

మోదీ అడిగారు

జపాన్ ఒసాకాలో జరిగిన జీ-20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీ... కశ్మీర్ అంశంలో తనను మధ్యవర్తిగా ఉండి, సహాయం చేయమని కోరారని ట్రంప్ పేర్కొన్నారు.

అంతలేదు

ట్రంప్ వ్యాఖ్యలను భారత్​ ఖండించింది. కశ్మీర్​ విషయంలో సహాయం చేయమని ట్రంప్​ను మోదీ కోరలేదని స్పష్టం చేసింది. 'కశ్మీర్'​ పూర్తిగా భారత్​, పాక్​ల ద్వైపాక్షిక సమస్య అని, చర్చల ద్వారా తామే తేల్చుకుంటామని తేల్చిచెప్పింది. ఇదే విషయాన్ని పార్లమెంట్​లో విదేశాంగమంత్రి జైశంకర్​ స్పష్టం చేశారు.

భారత్​తో స్నేహానికి గండి

అమెరికన్ దిగుమతులపై భారత్​ అధికంగా సుంకాలు విధిస్తోందంటూ భారత్​పైనా వాణిజ్య యుద్ధానికి తెరతీశారు ట్రంప్​. అది కాస్తా సద్దుమణిగింది అనుకునే లోపు.. ఇప్పుడు మధ్యవర్తిత్వం చేస్తానంటూ ప్రకటించి వివాదానికి కారణమయ్యారు. ఈ తప్పుడు చర్యలతో భారత్​ను దూరం చేసుకుని.. చైనాను నిలువరించడానికి ఉన్న ఏకైక అవకాశాన్ని అమెరికా చేజార్చుకుంటోందని ఆ పత్రిక పేర్కొంది.

ఇదీ చూడండి: రాజీవ్ హత్యకేసు నిందితురాలు నళిని విడుదల

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.