ETV Bharat / international

కొత్త మందుతో కరోనా​ కాళ్లు కట్టేయొచ్చు!

author img

By

Published : Mar 31, 2020, 4:53 PM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్​ను నియంత్రించేందుకు ప్రముఖ ఔషధ సంస్థలన్నీ నడుంబిగించాయి. ఆ ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. మానవ శరీరంలోకి వెళ్లిన వైరస్​ కణాన్ని అడ్డుకునేందుకు సరికొత్త మందు తయారు చేశారు మసాచుసెట్స్​ ఇన్​స్టిట్యూట్​కు చెందిన పరిశోధకులు.

MIT chemists are testing An experimental peptide could block Covid-19 enter human lung cells.
కొత్త మందుతో కరోనా వైరస్​ కాళ్లు కట్టేయొచ్చు!

కరోనాను అడ్డుకోవడానికి సరికొత్త మార్గం కనిపెట్టారా? అంటే అవునని అంటున్నారు మసాచుసెట్స్​ ఇన్​స్టిట్యూట్​కు చెందిన పరిశోధకులు. తాము తయారు చేసిన డ్రగ్... కరోనా వైరస్​ మానవ శరీరంలోకి, కణాల్లోకి చొచ్చుకు వెళ్లకుండా అడ్డుకుంటుందని చెబుతున్నారు. ఈ మందు వినియోగంలోకి వస్తే కొవిడ్​-19పై చికిత్స సులభం కానుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎలా పనిచేస్తుంది?

కొత్తగా తయారుచేసిన డ్రగ్​లో చిన్నపాటి ప్రొటీన్ లేదా పెప్టైడ్​ ఉంటుంది. అది మానవ కణంపై కవచంలా ఉంటుంది. సాధారణంగా కరోనా వైరస్​కు కొమ్ముల్లాంటి ప్రోటీన్​ ముళ్లు ఉంటాయి. ఇవి ముక్కు, నోరు ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశించాక.. మానవ కణాలకు అతుక్కుపోతాయి. అంతేకాకుండా ఇవి వేగంగా వృద్ధి చెందేందుకు ఆ కొమ్ములు బాగా ఉపయోగపడతాయి. అయితే వైరస్​కు ఉన్న ఆ ముళ్లు(కరోనా వైరస్ స్పైక్​​ ప్రోటీన్​)ను మానవ కణానికి అతుక్కోకుండా చేస్తుందీ కొత్త పెప్టైడ్​. ఆ వైరస్​ ముళ్లను తాడులాగా కట్టిపడేసి.. నిర్జీవంగా మార్చేస్తాయి. అయితే వైరస్​ ముళ్లు మానవ కణంలోని ఏంజియోటెన్సిన్​ కన్వర్టింగ్​ ఎంజైమ్​2(ఏసీఈ2)కు మాత్రమే అతుక్కుంటుంది. అలా రెండూ కలిసిన ప్రాంతాన్నే 'ఆల్ఫా హెలిక్స్'​ అంటారు. ఆ ప్రాంతాన్ని ఈ పెప్టైడ్​ కాపాడుతుంది. ఈ ఎంజైమ్​ ఎక్కువగా ఊపిరితిత్తుల్లో ఉంటుంది.

MIT chemists are testing An experimental peptide could block Covid-19 enter human lung cells.
కరోనా వైరస్​

కొత్త సాంకేతికతతో గంటలో...

మసాచుసెట్స్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ(ఎమ్​ఐటీ) పెప్టైడ్​ సింథసిస్​ టెక్నాలజీ సాయంతో.. 23 అమైనో యాసిడ్​లు కలిగిన పెప్టైడ్​ను తయారు చేశారు. అమైనో యాసిడ్​, ప్రోటీన్​ సమూహంతో 37 సెకన్లలో ఒక పెప్టైడ్ తయారవుతోంది. 50 అమైనో యాసిడ్​లు కలిపిన పెప్టైడ్​ కణాన్ని తయారు చేసేందుకు గంట పడుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ పెప్టైడ్​లను 100 విభిన్న వేరియంట్లతో తయారు చేస్తున్నారు. అతుక్కునే గుణం ద్వారా వాటిని వర్గీకరించనున్నారు. ప్రస్తుతం ఇది జంతువులపై ప్రయోగదశలో ఉన్నట్లు తెలిపారు.

దీని వల్ల ఉపయోగాలు..

ఇప్పటికే కరోనా వైరస్​ మందు కోసం ఒక్కో సంస్థ ఒక్కో విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఈ తరహా పద్ధతిలో తక్కువ సమయంలో ఎక్కువ మందును తయారుచేయొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఖర్చు కూడా తక్కువేనని చెప్పారు.

సాధారణ డ్రగ్స్​లో చిన్నపాటి మాలిక్యూల్స్​ ఉంటాయని.. పెప్టైడ్​లో పెద్ద మాలిక్యూల్స్​ ఉంటాయి కాబట్టి కరోనా వైరస్​పై ప్రభావవంతంగా పనిచేస్తాయని వివరించారు పరిశోధకులు. యాంటీబయోటిక్స్​ కూడా పెప్టైడ్​లానే పనిచేసినా.. వాటి తయారీకి, ఫార్ములా కనిపెట్టడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పారు.

ఇదొక్కటే ఇబ్బంది...!

పెప్టైడ్​లతో తయారైన డ్రగ్​ను నోటి ద్వారా తీసుకోవడానికి కుదరదు. ఇంజక్షన్​ ద్వారా మాత్రమే వీలవుతుంది. అయితే ఇది ఎక్కువ సమయం రక్తంలో ఉండి ఎంత ఉపయుక్తంగా పనిచేస్తుందన్న దానిపైనా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది అందుబాటులోకి వచ్చేందుకు నెలలు పడుతుందని ఎమ్​ఐటీ పరిశోధకులు చెప్పారు.

కరోనాను అడ్డుకోవడానికి సరికొత్త మార్గం కనిపెట్టారా? అంటే అవునని అంటున్నారు మసాచుసెట్స్​ ఇన్​స్టిట్యూట్​కు చెందిన పరిశోధకులు. తాము తయారు చేసిన డ్రగ్... కరోనా వైరస్​ మానవ శరీరంలోకి, కణాల్లోకి చొచ్చుకు వెళ్లకుండా అడ్డుకుంటుందని చెబుతున్నారు. ఈ మందు వినియోగంలోకి వస్తే కొవిడ్​-19పై చికిత్స సులభం కానుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎలా పనిచేస్తుంది?

కొత్తగా తయారుచేసిన డ్రగ్​లో చిన్నపాటి ప్రొటీన్ లేదా పెప్టైడ్​ ఉంటుంది. అది మానవ కణంపై కవచంలా ఉంటుంది. సాధారణంగా కరోనా వైరస్​కు కొమ్ముల్లాంటి ప్రోటీన్​ ముళ్లు ఉంటాయి. ఇవి ముక్కు, నోరు ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశించాక.. మానవ కణాలకు అతుక్కుపోతాయి. అంతేకాకుండా ఇవి వేగంగా వృద్ధి చెందేందుకు ఆ కొమ్ములు బాగా ఉపయోగపడతాయి. అయితే వైరస్​కు ఉన్న ఆ ముళ్లు(కరోనా వైరస్ స్పైక్​​ ప్రోటీన్​)ను మానవ కణానికి అతుక్కోకుండా చేస్తుందీ కొత్త పెప్టైడ్​. ఆ వైరస్​ ముళ్లను తాడులాగా కట్టిపడేసి.. నిర్జీవంగా మార్చేస్తాయి. అయితే వైరస్​ ముళ్లు మానవ కణంలోని ఏంజియోటెన్సిన్​ కన్వర్టింగ్​ ఎంజైమ్​2(ఏసీఈ2)కు మాత్రమే అతుక్కుంటుంది. అలా రెండూ కలిసిన ప్రాంతాన్నే 'ఆల్ఫా హెలిక్స్'​ అంటారు. ఆ ప్రాంతాన్ని ఈ పెప్టైడ్​ కాపాడుతుంది. ఈ ఎంజైమ్​ ఎక్కువగా ఊపిరితిత్తుల్లో ఉంటుంది.

MIT chemists are testing An experimental peptide could block Covid-19 enter human lung cells.
కరోనా వైరస్​

కొత్త సాంకేతికతతో గంటలో...

మసాచుసెట్స్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ(ఎమ్​ఐటీ) పెప్టైడ్​ సింథసిస్​ టెక్నాలజీ సాయంతో.. 23 అమైనో యాసిడ్​లు కలిగిన పెప్టైడ్​ను తయారు చేశారు. అమైనో యాసిడ్​, ప్రోటీన్​ సమూహంతో 37 సెకన్లలో ఒక పెప్టైడ్ తయారవుతోంది. 50 అమైనో యాసిడ్​లు కలిపిన పెప్టైడ్​ కణాన్ని తయారు చేసేందుకు గంట పడుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ పెప్టైడ్​లను 100 విభిన్న వేరియంట్లతో తయారు చేస్తున్నారు. అతుక్కునే గుణం ద్వారా వాటిని వర్గీకరించనున్నారు. ప్రస్తుతం ఇది జంతువులపై ప్రయోగదశలో ఉన్నట్లు తెలిపారు.

దీని వల్ల ఉపయోగాలు..

ఇప్పటికే కరోనా వైరస్​ మందు కోసం ఒక్కో సంస్థ ఒక్కో విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఈ తరహా పద్ధతిలో తక్కువ సమయంలో ఎక్కువ మందును తయారుచేయొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఖర్చు కూడా తక్కువేనని చెప్పారు.

సాధారణ డ్రగ్స్​లో చిన్నపాటి మాలిక్యూల్స్​ ఉంటాయని.. పెప్టైడ్​లో పెద్ద మాలిక్యూల్స్​ ఉంటాయి కాబట్టి కరోనా వైరస్​పై ప్రభావవంతంగా పనిచేస్తాయని వివరించారు పరిశోధకులు. యాంటీబయోటిక్స్​ కూడా పెప్టైడ్​లానే పనిచేసినా.. వాటి తయారీకి, ఫార్ములా కనిపెట్టడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పారు.

ఇదొక్కటే ఇబ్బంది...!

పెప్టైడ్​లతో తయారైన డ్రగ్​ను నోటి ద్వారా తీసుకోవడానికి కుదరదు. ఇంజక్షన్​ ద్వారా మాత్రమే వీలవుతుంది. అయితే ఇది ఎక్కువ సమయం రక్తంలో ఉండి ఎంత ఉపయుక్తంగా పనిచేస్తుందన్న దానిపైనా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది అందుబాటులోకి వచ్చేందుకు నెలలు పడుతుందని ఎమ్​ఐటీ పరిశోధకులు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.