ETV Bharat / international

భారతీయ అమెరికన్​కు ప్రతిష్ఠాత్మక పురస్కారం - inventor of the year rajiv joshi

వినూత్న సాంకేతిక పరికరాలను ఆవిష్కరించినందుకు గానూ భారతీయ అమెరికన్ రాజీవ్ జోషిని ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధస్సు రంగాల్లో చేసిన విశేష కృషిని గుర్తిస్తూ న్యూయార్క్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా అసోసియేషన్(మేధో సంపత్తి హక్కుల సంస్థ) ఇన్వెంటర్ ఆఫ్​ ది ఇయర్ పురస్కారాన్ని అందించింది.

rajiv joshi
భారతీయ అమెరికన్​కు ప్రతిష్ఠాత్మక పురస్కారం
author img

By

Published : May 26, 2020, 10:30 AM IST

భారతీయ అమెరికన్, న్యూయార్క్ ఐబీఎంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న రాజీవ్​ జోషిని ప్రతిష్ఠాత్మక 'ఇన్వెంటర్ ఆఫ్​ ది ఇయర్' పురస్కారం వరించింది. ఎలక్ట్రానిక్, కృత్రిమ మేధస్సు రంగాల్లో చేసిన విశేష కృషికిగానూ ఈ పురస్కారం లభించింది.

ఇప్పటికే 250 పరికరాలకు అమెరికాలో పేటెంట్లు పొందారు జోషి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఆవిష్కరణలను గుర్తించిన న్యూయార్క్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా అసోసియేషన్(మేధో సంపత్తి హక్కుల సంస్థ) ఈ సంవత్సర మేటి ఆవిష్కర్త పురస్కారాన్ని రాజీవ్​కు అందించింది.

rajiv joshi
రాజీవ్ జోషి

ముంబయి ఐఐటీలో విద్యాభ్యాసం..

ముంబయి ఐఐటీలో సాంకేతిక విద్యను అభ్యసించారు జోషి. అనంతరం అమెరికాలోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేశారు.

'మానవ అవసరాలే స్ఫూర్తి'

తనకు మానవ అవసరాలు, ఆసక్తి తన ఆవిష్కరణలకు స్ఫూర్తి అని చెప్పారు జోషి. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరానని వెల్లడించారు. క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్​లకు ఆదరణ పెరిగిందని చెప్పుకొచ్చారు ఈ శాస్త్రవేత్త.

ఇదీ చూడండి: 'అగ్ర' హోదా కోసం కాలుదువ్వుతున్న చైనా

భారతీయ అమెరికన్, న్యూయార్క్ ఐబీఎంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న రాజీవ్​ జోషిని ప్రతిష్ఠాత్మక 'ఇన్వెంటర్ ఆఫ్​ ది ఇయర్' పురస్కారం వరించింది. ఎలక్ట్రానిక్, కృత్రిమ మేధస్సు రంగాల్లో చేసిన విశేష కృషికిగానూ ఈ పురస్కారం లభించింది.

ఇప్పటికే 250 పరికరాలకు అమెరికాలో పేటెంట్లు పొందారు జోషి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఆవిష్కరణలను గుర్తించిన న్యూయార్క్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా అసోసియేషన్(మేధో సంపత్తి హక్కుల సంస్థ) ఈ సంవత్సర మేటి ఆవిష్కర్త పురస్కారాన్ని రాజీవ్​కు అందించింది.

rajiv joshi
రాజీవ్ జోషి

ముంబయి ఐఐటీలో విద్యాభ్యాసం..

ముంబయి ఐఐటీలో సాంకేతిక విద్యను అభ్యసించారు జోషి. అనంతరం అమెరికాలోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేశారు.

'మానవ అవసరాలే స్ఫూర్తి'

తనకు మానవ అవసరాలు, ఆసక్తి తన ఆవిష్కరణలకు స్ఫూర్తి అని చెప్పారు జోషి. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరానని వెల్లడించారు. క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్​లకు ఆదరణ పెరిగిందని చెప్పుకొచ్చారు ఈ శాస్త్రవేత్త.

ఇదీ చూడండి: 'అగ్ర' హోదా కోసం కాలుదువ్వుతున్న చైనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.