ETV Bharat / international

కరోనా విలయం: రాత్రిళ్లూ మృతదేహాల ఖననం

author img

By

Published : Apr 1, 2021, 1:13 PM IST

Updated : Apr 1, 2021, 2:06 PM IST

బ్రెజిల్​లో కరోనా మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సావో పాలో రాష్ట్రంలోని 'విలా ఫార్మొసా' శ్మశానవాటికలో రాత్రి 10 గంటల వరకు శవాల ఖననం జరుపుతున్నారు. వందల సంఖ్యలో మృతదేహాలు వస్తున్న తరుణంలో ఓ శ్మశాన వాటికను తాత్కాలికంగా మూసివేశారు.

covid deaths in brazil
ఆ శ్మశానవాటికలో రాత్రి వరకు శవాల ఖననం
బ్రెజిల్​లో పెరుగుతున్న కొవిడ్ మరణాలు

బ్రెజిల్​లో కరోనా విలయతాండవం చేస్తోంది. కొవిడ్​ మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని అత్యధిక జనాభా గల సావో పాలో​ రాష్ట్రంలోని 'విలా ఫార్మొసా' శ్మశానవాటిక మృతదేహాల దిబ్బగా మారింది. కొవిడ్​ మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ శ్మశానవాటికలో రాత్రి 10 గంటల వరకు శవాల ఖననం చేసుకునేందుకు అనుమతించింది ప్రభుత్వం.

brazil cemeteries
సామూహిక ఖననం

రాష్ట్రంలోని మరో మూడు శ్మశానవాటికల్లోనూ రాత్రి వరకు శవాల ఖననం జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వందల సంఖ్యలో మృతదేహాలు వస్తుండటం వల్ల 'విలా నొవా కషివోరిన్హా' శ్మశానవాటికలో స్థలం సరిపోని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ఈ శ్మశానవాటికను మూసివేశారు.

brazil cemeteries
రాత్రి 10 గంటల వరకు కరోనా మృతుల ఖననం

బుధవారం బ్రెజిల్​లో అత్యధికంగా 3,869 మంది వైరస్​ కారణంగా మృతిచెందారు. సావో పాలో రాష్ట్రంలో ఒక్కరోజే 1,160 మంది మరణించారు.

brazil cemeteries
విలా ఫార్మొసా శ్మశానవాటిక

కొవిడ్​ వ్యాప్తి ఉద్ధృతంగా మారినా ఆ దేశ ప్రధాని జైర్ బొల్సొనారో... కొవిడ్​ నిబంధనలను సడలించాలని రాష్ట్ర గవర్నర్​లకు, మేయర్లకు సూచించడం గమనార్హం.

ఇదీ చదవండి:హెచ్​-1బీపై ముగిసిన నిషేధం- మనోళ్లకు లాభం!

బ్రెజిల్​లో పెరుగుతున్న కొవిడ్ మరణాలు

బ్రెజిల్​లో కరోనా విలయతాండవం చేస్తోంది. కొవిడ్​ మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని అత్యధిక జనాభా గల సావో పాలో​ రాష్ట్రంలోని 'విలా ఫార్మొసా' శ్మశానవాటిక మృతదేహాల దిబ్బగా మారింది. కొవిడ్​ మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ శ్మశానవాటికలో రాత్రి 10 గంటల వరకు శవాల ఖననం చేసుకునేందుకు అనుమతించింది ప్రభుత్వం.

brazil cemeteries
సామూహిక ఖననం

రాష్ట్రంలోని మరో మూడు శ్మశానవాటికల్లోనూ రాత్రి వరకు శవాల ఖననం జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వందల సంఖ్యలో మృతదేహాలు వస్తుండటం వల్ల 'విలా నొవా కషివోరిన్హా' శ్మశానవాటికలో స్థలం సరిపోని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ఈ శ్మశానవాటికను మూసివేశారు.

brazil cemeteries
రాత్రి 10 గంటల వరకు కరోనా మృతుల ఖననం

బుధవారం బ్రెజిల్​లో అత్యధికంగా 3,869 మంది వైరస్​ కారణంగా మృతిచెందారు. సావో పాలో రాష్ట్రంలో ఒక్కరోజే 1,160 మంది మరణించారు.

brazil cemeteries
విలా ఫార్మొసా శ్మశానవాటిక

కొవిడ్​ వ్యాప్తి ఉద్ధృతంగా మారినా ఆ దేశ ప్రధాని జైర్ బొల్సొనారో... కొవిడ్​ నిబంధనలను సడలించాలని రాష్ట్ర గవర్నర్​లకు, మేయర్లకు సూచించడం గమనార్హం.

ఇదీ చదవండి:హెచ్​-1బీపై ముగిసిన నిషేధం- మనోళ్లకు లాభం!

Last Updated : Apr 1, 2021, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.