ETV Bharat / international

షికాగో స్థానిక పోరులో భారతీయ-అమెరికన్లు

author img

By

Published : Apr 3, 2021, 7:26 AM IST

అమెరికా షికాగో స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 మంది భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు పోటీ చేస్తున్నారు. ఇందులో ఓక్​ బ్రూక్​ నగర ట్రస్టీ స్థానం కోసం తెలుగు మూలాలు ఉన్న డాక్టర్​ సురేష్​ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ అభ్యర్థుల్లో ఐదుగురు మహిళలూ ఉండటం విశేషం.

Indian-Americans
షికాగో స్థానిక ఎన్నికల్లో 10 మంది భారతీయ-అమెరికన్లు

అమెరికాలోని షికాగో ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో పది మంది ఇండియన్​-అమెరికన్లు పోటీ చేస్తున్నారు. ఇందులో ఒకరు తెలుగు మూలాలు ఉన్న వైద్యుడు కావడం విశేషం. అభ్యర్థుల్లో ఐదుగురు మహిళలు ఉండడం ఇంకో విశేషం. ఈ నెల ఆరో తేదీన ఎన్నికలు జరగనుండగా.. పోస్టల్​ బ్యాలెట్​ అప్పుడే ప్రారంభమయింది. ఓక్​ బ్రూక్​ నగర ట్రస్టీ స్థానం కోసం డాక్టర్​ సురేష్​ రెడ్డి పోటీ పడుతున్నారు. ఆయన గతంలో అమెరికన్​ అసోసియేషన్​ ఆఫ్​ ఫిజీషియన్స్​ ఆఫ్​ ఇండియన్​ ఆరిజన్​(ఏఏపీఐ) అధ్యక్షునిగా కూడా పనిచేశారు.

ఎవరెవరు? ఎక్కడెక్కడ?

  • మైనే టౌన్​షిప్​ హైవే కమిషనర్​ పదవికి జితేంద్ర దిగ్నావ్​కర్​, షాంబర్గ్​ టౌన్​షిప్ ట్రస్టీ​ పదవికి నిమిషీ జాని, హోనోవర్​ పార్క్​ ట్రస్టీ పదవికి సయ్యద్​ హుస్సైనీ, మైన్​ టౌన్​షిప్​ క్లర్క్​ పదవికి స్మితేష్​ షా పోటీ పడుతున్నారు.
  • మహిళల్లో వాసవీ చక్కా(నాపెర్​విల్లీ సిటీ కౌన్సిల్), మేఘనా బన్సల్​(వీట్​ల్యాండ్​ టౌన్​షిప్​-ట్రస్టీ), స్వేతా బెయిర్​ అరోడా(ఆల్డర్​మ్యాన్​ 10వ వార్డు), సుప్నా జైన్​, సాబా హైదర్​(డిస్ట్రిక్ట్​ 204 స్కూలు బోర్డు)లు బరిలో ఉన్నారు.

ఇదీ చూడండి:ఆ పోలీసు గౌరవార్థం అమెరికా జెండా అవనతం

అమెరికాలోని షికాగో ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో పది మంది ఇండియన్​-అమెరికన్లు పోటీ చేస్తున్నారు. ఇందులో ఒకరు తెలుగు మూలాలు ఉన్న వైద్యుడు కావడం విశేషం. అభ్యర్థుల్లో ఐదుగురు మహిళలు ఉండడం ఇంకో విశేషం. ఈ నెల ఆరో తేదీన ఎన్నికలు జరగనుండగా.. పోస్టల్​ బ్యాలెట్​ అప్పుడే ప్రారంభమయింది. ఓక్​ బ్రూక్​ నగర ట్రస్టీ స్థానం కోసం డాక్టర్​ సురేష్​ రెడ్డి పోటీ పడుతున్నారు. ఆయన గతంలో అమెరికన్​ అసోసియేషన్​ ఆఫ్​ ఫిజీషియన్స్​ ఆఫ్​ ఇండియన్​ ఆరిజన్​(ఏఏపీఐ) అధ్యక్షునిగా కూడా పనిచేశారు.

ఎవరెవరు? ఎక్కడెక్కడ?

  • మైనే టౌన్​షిప్​ హైవే కమిషనర్​ పదవికి జితేంద్ర దిగ్నావ్​కర్​, షాంబర్గ్​ టౌన్​షిప్ ట్రస్టీ​ పదవికి నిమిషీ జాని, హోనోవర్​ పార్క్​ ట్రస్టీ పదవికి సయ్యద్​ హుస్సైనీ, మైన్​ టౌన్​షిప్​ క్లర్క్​ పదవికి స్మితేష్​ షా పోటీ పడుతున్నారు.
  • మహిళల్లో వాసవీ చక్కా(నాపెర్​విల్లీ సిటీ కౌన్సిల్), మేఘనా బన్సల్​(వీట్​ల్యాండ్​ టౌన్​షిప్​-ట్రస్టీ), స్వేతా బెయిర్​ అరోడా(ఆల్డర్​మ్యాన్​ 10వ వార్డు), సుప్నా జైన్​, సాబా హైదర్​(డిస్ట్రిక్ట్​ 204 స్కూలు బోర్డు)లు బరిలో ఉన్నారు.

ఇదీ చూడండి:ఆ పోలీసు గౌరవార్థం అమెరికా జెండా అవనతం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.