ETV Bharat / international

లాక్​డౌన్​లో పెరిగిన పేదల ఆకలి బాధలు

author img

By

Published : May 8, 2020, 3:01 PM IST

Updated : May 8, 2020, 4:22 PM IST

లాక్​డౌన్ కారణంగా పేదల జీవనం కష్టంగా మారిందని పేర్కొంది ఐరాస అనుంబంధ అంతర్జాతీయ కార్మిక సంస్థ. ముఖ్యంగా వలస కార్మికుల జీవనం దుర్భరమై పోయిందని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురి కార్మికుల్లో నలుగురి పని స్థలాలను మూసేశారని.. తద్వారా పేదలు ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారని స్పష్టం చేసింది.

world poverty
'లాక్​డౌన్ కారణంగా పేదల ఆకలి కష్టాలు'

లాక్​డౌన్ వేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిరుపేదలు తమ జీవితాలను నిలుపుకోవడం కోసం శ్రమిస్తున్నట్లు పేర్కొంది అంతర్జాతీయ కార్మిక సంస్థ. కెన్యా నుంచి అర్జెంటీనా వరకు శ్రామికులు ఇప్పటికే అందుతున్న తక్కువ వేతనాలతో అరకొర జీవనం సాగిస్తుండగా.. లాక్​డౌన్​లో మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 3.3 బిలియన్లుగా ఉన్న కార్మికుల్లో.. ఐదుగురిని నమూనాగా తీసుకుంటే నలుగురి పనిస్థలాలను మూసివేశారని వెల్లడించింది సంస్థ. అనధికారికంగా మరో 1.6 బిలియన్ల కార్మికుల జీవనం.. పనులు మూసివేసిన కారణంగా ప్రమాదంలో పడినట్లు పేర్కొంది.

పెరిగిన కష్టాలు..

ఆకలి, పేదరికంతో బాధపడే కుటుంబాలు ఇంతకుముందు సంఖ్యతో పోలిస్తే పెరగినట్లు చెప్పింది. లాక్​డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండిపోవడం చాలామందికి ప్రత్యామ్నాయం కాదని వెల్లడించింది సంస్థ. ఒక పూట భోజనం కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి.. ఏదో ఒక పని చేయాల్సి ఉంటుందని తెలిపింది.

'ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే..?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదలు మహమ్మారి ప్రభావం నుంచి ఎంత తొందరగా బయటపడితే.. అంతే స్థాయిలో ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని పేర్కొంది కార్మిక సంస్థ. తద్వారా దేశాలకు కావాలసిన ఆర్థిక సాయం అందించేందుకు వీలు కలుగుతుందని చెప్పింది. ఈ సందర్భంగా పలు ఉదాహరణలు ఉటంకించింది.

కెన్యాకు చెందిన జూడిత్..

జూడిత్ అండెకా భర్త రెండేళ్ల కిందట మృతి చెందాడు. ఆమెకు ఐదుగురు పిల్లలు. నైరోబీలోని ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడ కిబేరాలో బట్టలు ఉతకడం ద్వారా రోజుకు 2.50 డాలర్ల నుంచి 4 డాలర్ల సంపాదన ఉండేది. అయితే ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఆమె పనికి వెళ్లడం లేదు. దీంతో ఐదుగురు పిల్లలతో ఆమె బతకడం కష్టమైపోతోంది.

అర్జెంటీనా రోజ్​మేరి పెజ్​దీ మరో కథ..

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వీధుల్లో తోపుడు బండిలో కాఫీ విక్రయిస్తుంది రోజ్​మేరీ. లాక్​డౌన్ కారణంగా ఆమె వ్యాపారం నిలిచిపోయింది. ఆమె భర్త కమ్మరిగా పనిచేసేవాడు. నెలకు 119 డాలర్లు ఈ కుటుంబం అద్దె ఇంటికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ కుటుంబం ప్రభుత్వం అందించే సాయం పైనే ఆధారపడి బతుకుతోంది.

ఇలా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పేదల జన జీవనం అతలాకుతలమైపోతోంది.

ఇదీ చూడండి: అమెరికా వైద్యుల శుభవార్త- ఆ పద్ధతితో కరోనాకు చెక్!

లాక్​డౌన్ వేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిరుపేదలు తమ జీవితాలను నిలుపుకోవడం కోసం శ్రమిస్తున్నట్లు పేర్కొంది అంతర్జాతీయ కార్మిక సంస్థ. కెన్యా నుంచి అర్జెంటీనా వరకు శ్రామికులు ఇప్పటికే అందుతున్న తక్కువ వేతనాలతో అరకొర జీవనం సాగిస్తుండగా.. లాక్​డౌన్​లో మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 3.3 బిలియన్లుగా ఉన్న కార్మికుల్లో.. ఐదుగురిని నమూనాగా తీసుకుంటే నలుగురి పనిస్థలాలను మూసివేశారని వెల్లడించింది సంస్థ. అనధికారికంగా మరో 1.6 బిలియన్ల కార్మికుల జీవనం.. పనులు మూసివేసిన కారణంగా ప్రమాదంలో పడినట్లు పేర్కొంది.

పెరిగిన కష్టాలు..

ఆకలి, పేదరికంతో బాధపడే కుటుంబాలు ఇంతకుముందు సంఖ్యతో పోలిస్తే పెరగినట్లు చెప్పింది. లాక్​డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండిపోవడం చాలామందికి ప్రత్యామ్నాయం కాదని వెల్లడించింది సంస్థ. ఒక పూట భోజనం కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి.. ఏదో ఒక పని చేయాల్సి ఉంటుందని తెలిపింది.

'ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే..?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదలు మహమ్మారి ప్రభావం నుంచి ఎంత తొందరగా బయటపడితే.. అంతే స్థాయిలో ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని పేర్కొంది కార్మిక సంస్థ. తద్వారా దేశాలకు కావాలసిన ఆర్థిక సాయం అందించేందుకు వీలు కలుగుతుందని చెప్పింది. ఈ సందర్భంగా పలు ఉదాహరణలు ఉటంకించింది.

కెన్యాకు చెందిన జూడిత్..

జూడిత్ అండెకా భర్త రెండేళ్ల కిందట మృతి చెందాడు. ఆమెకు ఐదుగురు పిల్లలు. నైరోబీలోని ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడ కిబేరాలో బట్టలు ఉతకడం ద్వారా రోజుకు 2.50 డాలర్ల నుంచి 4 డాలర్ల సంపాదన ఉండేది. అయితే ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఆమె పనికి వెళ్లడం లేదు. దీంతో ఐదుగురు పిల్లలతో ఆమె బతకడం కష్టమైపోతోంది.

అర్జెంటీనా రోజ్​మేరి పెజ్​దీ మరో కథ..

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వీధుల్లో తోపుడు బండిలో కాఫీ విక్రయిస్తుంది రోజ్​మేరీ. లాక్​డౌన్ కారణంగా ఆమె వ్యాపారం నిలిచిపోయింది. ఆమె భర్త కమ్మరిగా పనిచేసేవాడు. నెలకు 119 డాలర్లు ఈ కుటుంబం అద్దె ఇంటికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ కుటుంబం ప్రభుత్వం అందించే సాయం పైనే ఆధారపడి బతుకుతోంది.

ఇలా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పేదల జన జీవనం అతలాకుతలమైపోతోంది.

ఇదీ చూడండి: అమెరికా వైద్యుల శుభవార్త- ఆ పద్ధతితో కరోనాకు చెక్!

Last Updated : May 8, 2020, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.