ETV Bharat / entertainment

దిల్​రాజు గిల్డ్​​ మాఫియా బ్యాచ్​: సి.కల్యాణ్‌ వైరల్ కామెంట్స్​

author img

By

Published : Feb 18, 2023, 3:56 PM IST

Updated : Feb 18, 2023, 5:54 PM IST

టాలీవుడ్​లోని నిర్మాతల మండలి నూతన కార్యవర్గ ఎన్నికలు జరగనున్న వేళ, నిర్మాత సి.కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్మాతల మండలిలోని గిల్డ్ సభ్యుల మాఫియా వల్ల చిత్ర పరిశ్రమ ప్రమాదంలో పడబోతుందని అన్నారు. అలాగే దిల్​రాజుపై తీవ్ర విమర్శలు కూడా చేశారు.

Etv Bharat
Etv Bharat

నిర్మాతల మండలిలోని గిల్డ్ సభ్యుల మాఫియా వల్ల చిత్ర పరిశ్రమ ప్రమాదంలో పడనుందని నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు సి.కళ్యాణ్ ఆరోపించారు. చిన్న సినిమాలను అణగదొక్కుతూ పరిశ్రమను నాశనం చేస్తున్నారని కళ్యాణ్ ఘాటుగా విమర్శించారు. ఆదివారం నిర్మాతల మండలి నూతన కార్యవర్గానికి ఎన్నికలు జరుగనున్న వేళ మీడియా ముందుకొచ్చిన సి.కళ్యాణ్.. గిల్డ్ పేరుతో 27 మంది నిర్మాతలు పరిశ్రమను ఎలా దోపిడి చేస్తున్నారో వివరించారు.

నిర్మాతల మండలి సభ్యుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఎల్ఎల్​పిని తప్పుదోవ పట్టిందని..వాణిజ్య ప్రకటనలు, అవార్డుల పేరుతో డబ్బు దోచుకుంటున్నారని ఆరోపించిన కళ్యాణ్.. నిర్మాతల మండలి ఎన్నికల్లో గిల్డ్ సభ్యులు పోటీ చేస్తుండటంపై ఆభ్యంతరం వ్యక్తం చేశారు. చిన్న నిర్మాతలను బతికిస్తేనే చిత్ర పరిశ్రమ బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న దామోదర ప్రసాద్ తరపున ప్రముఖ నిర్మాత దిల్ రాజు మద్దతు పలుకుతున్నారు. కాగా సభ్యులు దిల్​రాజును తప్పదోవ పట్టించి ప్రచారాన్ని సాగిస్తున్నారని పేర్కొన్న కళ్యాణ్.. గిల్ట్ మాఫియాలో దిల్ రాజు కూడా భాగస్వామేనని విమర్శించారు.

నిర్మాతల మండలి ఎన్నికలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న దామోదర ప్రసాద్​కు మద్దతు పలికిన దిల్ రాజు... ప్రొగ్రెసివ్ ప్రొడ్యూసర్ ప్యానెల్ పేరుతో పోటీలో ఉన్న సభ్యులకు ఓటు వేయాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్యానెల్​లో ఎక్కువ మంది సినిమాలు చేసే నిర్మాతలే ఉన్నారని, సభ్యుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నీ ప్రొగ్రెసివ్ ప్రొడ్యూస్ ప్యానెల్ అమలు చేస్తుందన్నారు. సానుకూల దృక్పథంతో ముందుకొచ్చి సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని దిల్ రాజు కోరారు.

నిర్మాతల మండలిలోని గిల్డ్ సభ్యుల మాఫియా వల్ల చిత్ర పరిశ్రమ ప్రమాదంలో పడనుందని నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు సి.కళ్యాణ్ ఆరోపించారు. చిన్న సినిమాలను అణగదొక్కుతూ పరిశ్రమను నాశనం చేస్తున్నారని కళ్యాణ్ ఘాటుగా విమర్శించారు. ఆదివారం నిర్మాతల మండలి నూతన కార్యవర్గానికి ఎన్నికలు జరుగనున్న వేళ మీడియా ముందుకొచ్చిన సి.కళ్యాణ్.. గిల్డ్ పేరుతో 27 మంది నిర్మాతలు పరిశ్రమను ఎలా దోపిడి చేస్తున్నారో వివరించారు.

నిర్మాతల మండలి సభ్యుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఎల్ఎల్​పిని తప్పుదోవ పట్టిందని..వాణిజ్య ప్రకటనలు, అవార్డుల పేరుతో డబ్బు దోచుకుంటున్నారని ఆరోపించిన కళ్యాణ్.. నిర్మాతల మండలి ఎన్నికల్లో గిల్డ్ సభ్యులు పోటీ చేస్తుండటంపై ఆభ్యంతరం వ్యక్తం చేశారు. చిన్న నిర్మాతలను బతికిస్తేనే చిత్ర పరిశ్రమ బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న దామోదర ప్రసాద్ తరపున ప్రముఖ నిర్మాత దిల్ రాజు మద్దతు పలుకుతున్నారు. కాగా సభ్యులు దిల్​రాజును తప్పదోవ పట్టించి ప్రచారాన్ని సాగిస్తున్నారని పేర్కొన్న కళ్యాణ్.. గిల్ట్ మాఫియాలో దిల్ రాజు కూడా భాగస్వామేనని విమర్శించారు.

నిర్మాతల మండలి ఎన్నికలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న దామోదర ప్రసాద్​కు మద్దతు పలికిన దిల్ రాజు... ప్రొగ్రెసివ్ ప్రొడ్యూసర్ ప్యానెల్ పేరుతో పోటీలో ఉన్న సభ్యులకు ఓటు వేయాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్యానెల్​లో ఎక్కువ మంది సినిమాలు చేసే నిర్మాతలే ఉన్నారని, సభ్యుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నీ ప్రొగ్రెసివ్ ప్రొడ్యూస్ ప్యానెల్ అమలు చేస్తుందన్నారు. సానుకూల దృక్పథంతో ముందుకొచ్చి సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని దిల్ రాజు కోరారు.

Last Updated : Feb 18, 2023, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.