ETV Bharat / elections

సర్వత్రా ఉత్కంఠ​.. కాసేపట్లో ఎగ్జిట్​ పోల్స్​!

సార్వత్రిక ఎన్నికల సమరం నేటితో ముగుస్తుంది. ఇక అందరి దృష్టి ఫలితాలపైనే. ఈ మధ్యలో సాధారణ ఓటరు నుంచి బడా నేతలూ ఆసక్తిగా చూసే అంశం ఎగ్జిట్​ పోల్స్​. హోరాహోరీగా సాగిన సమరంలో విజేత ఎవరన్నదానిపై ముందస్తు అంచనాలు... కాసేపట్లో వెలువడనున్నాయి.

author img

By

Published : May 19, 2019, 2:27 PM IST

Updated : May 19, 2019, 4:52 PM IST

ఎన్నికలు

2019 ఎన్నికల కురుక్షేత్రం చివరి అంకానికి చేరుకుంది. నేటితో పూర్తిస్థాయిలో పోలింగ్​ ప్రక్రియ ముగియనుంది. ఓటింగ్ సమయం ముగిసిన మరుక్షణం అందరి దృష్టి టీవీల్లో విడుదలయ్యే ఎగ్జిట్​ పోల్స్​పైనే. 'ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది...? ఎవరు అధికారంలోకి వస్తారు?' అంటూ సాగే విశ్లేషణాత్మక ఎగ్జిట్​ పోల్స్​పై సాధారణ ఓటరు నుంచి బడా నేతల వరకు అమితాసక్తి చూపిస్తారు.

పోలింగ్​ ముగిసిన వెంటనే ఎగ్జిట్​ పోల్స్​ విడుదల చేసేందుకు టీవీ ఛానళ్లు, విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. ప్రధానమంత్రి ఎవరు అవుతారు...? మరోసారి ఎన్డీఏ కూటమి వస్తుందా..? లేదా కాంగ్రెస్​కు పునర్​వైభవం దక్కనుందా..? అధికారాన్ని నిర్ణయించగల రాష్ట్రమైన యూపీలో ఎవరు నిలుస్తారు? అంటూ సాగే విశ్లేషణలు బుల్లితెరలపై మార్మోగిపోతాయి.

వీటన్నింటిపై క్షేత్ర స్థాయిలో ఒపీనియన్​, ఎగ్జిట్​ పోల్స్​ ద్వారా మీడియా ఛానళ్లు సర్వేలు నిర్వహిస్తాయి. గతాన్ని గమనిస్తే ప్రజాభిప్రాయాన్ని సేకరించే పనిలో కొన్నిసార్లు ఇవి సఫలమయ్యాయి. మరికొన్ని సార్లు ఘోరంగా విఫలమయ్యాయి.

2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా సునామీ సృష్టించిన ఏడాది తర్వాత దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో భాజపా, ఆమ్​ఆద్మీ, కాంగ్రెస్​ కొదమ సింహాల్లా గర్జించాయి. మోదీ ఏడాది పాలనకు, దేశ రాజధానిలో ఆమ్​ ఆద్మీ బలానికి, 15 ఏళ్ల పాటు దిల్లీని పాలించిన కాంగ్రెస్​ పట్ల ప్రజాభిప్రాయానికి ఈ ఎన్నికలు అద్దం పడతాయని అందరూ అంచనా వేశారు.

70 అసెంబ్లీ స్థానాలు ఉన్న దిల్లీలో ఆప్​ 40-45 సీట్ల వరకు గెలిచి ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. అయితే ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఆప్​ 70 సీట్లలో 67 గెలిచి చరిత్ర సృష్టించింది.

బిహార్​లోనూ అదే కథ

2015లో బిహార్​లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ప్రధాన పోటీ భాజపా..., జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్​ మహాకూటమి మధ్యే.

ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని దీటుగా ఎదుర్కొనే నేత నితీశ్ కుమార్​ అని కొందరు అభివర్ణించారు. ఎగ్జిట్​ పోల్స్​ భాజపాకు 243 అసెంబ్లీ స్థానాల్లో 100+ వస్తాయని, మహాకూటమి.. కాషాయ పార్టీ వెనుక ఉండొచ్చని అంచనా వేశాయి. ​

అయితే ఫలితాల నాడు మాత్రం కథ తారుమారైంది. ఎన్​డీఏ 58 సీట్లకే పరిమితమైంది. జేడీయూ, ఆర్​ఎల్​డీ నేతృత్వంలోని మహాకూటమి 178 సీట్లతో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇక్కడా ఎగ్జిట్​ పోల్స్ ఓటరు నాడి పట్టుకోలేకపోయాయి.

ఎగ్జిట్​ పోల్స్​లో గెలిచారు.. ఫలితాల్లో ఓడారు

2004 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలుపు తథ్యమని ఎగ్జిట్​ పోల్స్​ కోడై కూశాయి. కాషాయ పార్టీ ఆ ఎన్నికలకు 'ఇండియా షైనింగ్'​ అనే నినాదంతో బరిలోకి దిగింది. మరోసారి వాజ్​పేయీ ప్రభుత్వం రావడం ఖాయమని అందరూ భావించారు. 543 లోక్​సభ సీట్లలో 230- 275 స్థానాలు ఎన్​డీఏకు వస్తాయని అంచనా వేశాయి ఎగ్జిట్​ పోల్స్​.

ఎన్నికల ఫలితాల వేళ మాత్రం ఎన్​డీఏ 185 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏ 218 సీట్లు గెలుచుకుంది. అనంతరం ఎస్పీ, బీఎస్పీ, వామ పక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది యూపీఏ.

ఈ సందర్భాలన్నింటా ఎగ్జిట్​ పోల్స్​ విఫలమయినంత మాత్రాన మొత్తానికి నమ్మకూడదు అని చెప్పలేం. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడంలో ఎగ్జిట్​ పోల్స్​ సఫలమయ్యాయి.

అయితే ఈ ఎగ్జిట్​ పోల్స్​ కేవలం కొద్ది శాతం మంది ప్రజల అభిప్రాయ సేకరణ మాత్రమేనన్న విషయాన్ని ఓటర్లు సహా నేతలు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల పరిస్థితులు, వాతావరణాన్ని అంచనా వేయగలవే గాని ఓటర్ల మనసులో ఏముందో ఏ ఎగ్జిట్​ పోల్స్ చెప్పలేవు.

మే 23న రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఏ ఎగ్జిట్​ పోల్స్​ ఎలా అంచనా వేస్తాయో చూడాలి మరి!

ఇదీ చూడండి: సార్వత్రికం తుది దశ పోలింగ్​ షురూ..

2019 ఎన్నికల కురుక్షేత్రం చివరి అంకానికి చేరుకుంది. నేటితో పూర్తిస్థాయిలో పోలింగ్​ ప్రక్రియ ముగియనుంది. ఓటింగ్ సమయం ముగిసిన మరుక్షణం అందరి దృష్టి టీవీల్లో విడుదలయ్యే ఎగ్జిట్​ పోల్స్​పైనే. 'ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది...? ఎవరు అధికారంలోకి వస్తారు?' అంటూ సాగే విశ్లేషణాత్మక ఎగ్జిట్​ పోల్స్​పై సాధారణ ఓటరు నుంచి బడా నేతల వరకు అమితాసక్తి చూపిస్తారు.

పోలింగ్​ ముగిసిన వెంటనే ఎగ్జిట్​ పోల్స్​ విడుదల చేసేందుకు టీవీ ఛానళ్లు, విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. ప్రధానమంత్రి ఎవరు అవుతారు...? మరోసారి ఎన్డీఏ కూటమి వస్తుందా..? లేదా కాంగ్రెస్​కు పునర్​వైభవం దక్కనుందా..? అధికారాన్ని నిర్ణయించగల రాష్ట్రమైన యూపీలో ఎవరు నిలుస్తారు? అంటూ సాగే విశ్లేషణలు బుల్లితెరలపై మార్మోగిపోతాయి.

వీటన్నింటిపై క్షేత్ర స్థాయిలో ఒపీనియన్​, ఎగ్జిట్​ పోల్స్​ ద్వారా మీడియా ఛానళ్లు సర్వేలు నిర్వహిస్తాయి. గతాన్ని గమనిస్తే ప్రజాభిప్రాయాన్ని సేకరించే పనిలో కొన్నిసార్లు ఇవి సఫలమయ్యాయి. మరికొన్ని సార్లు ఘోరంగా విఫలమయ్యాయి.

2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా సునామీ సృష్టించిన ఏడాది తర్వాత దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో భాజపా, ఆమ్​ఆద్మీ, కాంగ్రెస్​ కొదమ సింహాల్లా గర్జించాయి. మోదీ ఏడాది పాలనకు, దేశ రాజధానిలో ఆమ్​ ఆద్మీ బలానికి, 15 ఏళ్ల పాటు దిల్లీని పాలించిన కాంగ్రెస్​ పట్ల ప్రజాభిప్రాయానికి ఈ ఎన్నికలు అద్దం పడతాయని అందరూ అంచనా వేశారు.

70 అసెంబ్లీ స్థానాలు ఉన్న దిల్లీలో ఆప్​ 40-45 సీట్ల వరకు గెలిచి ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. అయితే ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఆప్​ 70 సీట్లలో 67 గెలిచి చరిత్ర సృష్టించింది.

బిహార్​లోనూ అదే కథ

2015లో బిహార్​లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ప్రధాన పోటీ భాజపా..., జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్​ మహాకూటమి మధ్యే.

ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని దీటుగా ఎదుర్కొనే నేత నితీశ్ కుమార్​ అని కొందరు అభివర్ణించారు. ఎగ్జిట్​ పోల్స్​ భాజపాకు 243 అసెంబ్లీ స్థానాల్లో 100+ వస్తాయని, మహాకూటమి.. కాషాయ పార్టీ వెనుక ఉండొచ్చని అంచనా వేశాయి. ​

అయితే ఫలితాల నాడు మాత్రం కథ తారుమారైంది. ఎన్​డీఏ 58 సీట్లకే పరిమితమైంది. జేడీయూ, ఆర్​ఎల్​డీ నేతృత్వంలోని మహాకూటమి 178 సీట్లతో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇక్కడా ఎగ్జిట్​ పోల్స్ ఓటరు నాడి పట్టుకోలేకపోయాయి.

ఎగ్జిట్​ పోల్స్​లో గెలిచారు.. ఫలితాల్లో ఓడారు

2004 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలుపు తథ్యమని ఎగ్జిట్​ పోల్స్​ కోడై కూశాయి. కాషాయ పార్టీ ఆ ఎన్నికలకు 'ఇండియా షైనింగ్'​ అనే నినాదంతో బరిలోకి దిగింది. మరోసారి వాజ్​పేయీ ప్రభుత్వం రావడం ఖాయమని అందరూ భావించారు. 543 లోక్​సభ సీట్లలో 230- 275 స్థానాలు ఎన్​డీఏకు వస్తాయని అంచనా వేశాయి ఎగ్జిట్​ పోల్స్​.

ఎన్నికల ఫలితాల వేళ మాత్రం ఎన్​డీఏ 185 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏ 218 సీట్లు గెలుచుకుంది. అనంతరం ఎస్పీ, బీఎస్పీ, వామ పక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది యూపీఏ.

ఈ సందర్భాలన్నింటా ఎగ్జిట్​ పోల్స్​ విఫలమయినంత మాత్రాన మొత్తానికి నమ్మకూడదు అని చెప్పలేం. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడంలో ఎగ్జిట్​ పోల్స్​ సఫలమయ్యాయి.

అయితే ఈ ఎగ్జిట్​ పోల్స్​ కేవలం కొద్ది శాతం మంది ప్రజల అభిప్రాయ సేకరణ మాత్రమేనన్న విషయాన్ని ఓటర్లు సహా నేతలు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల పరిస్థితులు, వాతావరణాన్ని అంచనా వేయగలవే గాని ఓటర్ల మనసులో ఏముందో ఏ ఎగ్జిట్​ పోల్స్ చెప్పలేవు.

మే 23న రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఏ ఎగ్జిట్​ పోల్స్​ ఎలా అంచనా వేస్తాయో చూడాలి మరి!

ఇదీ చూడండి: సార్వత్రికం తుది దశ పోలింగ్​ షురూ..

SNTV Daily Planning, 0700 GMT
Sunday 19th May 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: AFC Champions League preview as Al Duhail (Qatar) prepare to play Al Hilal (Saudi Arabia) in Doha. Expect at 2100.
SOCCER: AFC Champions League preview as Al Ain (UAE) prepare to play Esteghlal (Iran). Timing to be confirmed.
SOCCER: AFC Champions League preview as Persepolis (Iran) prepare to play Al Sadd (Qatar). Timing to be confirmed.
SOCCER: Qatar 2022. Conducted vists to training sites, metro stations and the Education City stadium take place as progress towards the 2022 World Cup continues. Expect at 1000.
SOCCER: Reaction following Real Madrid v Betis in La Liga. Expect at 1400.
SOCCER: Reaction following Eibar v Barcelona in La Liga. Expect at 1830.
SOCCER: Highlights from Serie A as Juventus play Atalanta. Expect at 2030.
SOCCER: Mixed-zone reaction following Juventus v Atalanta in Serie A. Expect at 2230.
SOCCER: Manager reaction following Juventus v Atalanta in Serie A. Expect at 2200.
SOCCER: Highlights from Serie A as Milan entertain Frosinone. Expect at 1800.
SOCCER: Highlights from Serie A as Napoli take on Inter Milan. Expect at 2030.
SOCCER: Mixed-zone reaction following Napoli v Inter Milan in Italy's Serie A. Expect at 2330.
SOCCER: Manager reaction following Napoli v Inter Milan in Italy's Serie A. Expect at 2300.
SOCCER: Highlights from the Scottish Premiership, Celtic v Hearts. Expect at 1600.
SOCCER: Highlights from the Scottish Premiership, Kilmarnock v Rangers. Expect at 1600.
TENNIS: Highlights from men's final at the Italian Open in Rome. Expect at 1530.
TENNIS: Highlights from the women's final at the Italian Open in Rome. Expect at 1900.
GOLF (PGA): The PGA Championship reaches its climax at Bethpage State Park Black Course, Bethpage, New York, USA. Expect at 2330.
MOTOGP: Race day at the Grand Prix de France in Le Mans, France. Expect at 1430.
CYCLING: Highlights from stage nine of the Giro d'Italia. Expect at 1630.
CRICKET: Reaction following the final ODI between England and Pakistan from Headingley, Leeds. Timing to be confirmed.
VARIOUS: Highlights from the final night of action at the World Taekwondo Championships, Manchester, UK. Expect at 1930.
BADMINTON: Sudirman Cup action from Nanning in China. Expect at 0930.
ESPORTS: Inaugural South East Asia Clash of Champions - top teams from Indonesia, Philippines, Malaysia, Myanmar and Singapore compete in Moonton's Mobile Legends: Bang Bang. Expect at 0830.
SOCCER: Selected highlights from the Malaysia Super League. Already moved.
SOCCER: Australian A-League Grand Final as Perth Glory take on Sydney FC. Expect at 1130.
SOCCER: Tianjin Teda v Hebei CFFC in the Chinese Super League. Expect at 1000.
SOCCER: Shenzen v Dalian Yifang in the Chinese Super League. Expect at 1400.
Last Updated : May 19, 2019, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.