ETV Bharat / crime

GUN:నాటుతుపాకీతో ఆటో డ్రైవర్​కు బెదిరింపులు

author img

By

Published : Jul 1, 2021, 11:27 PM IST

నిజామాబాద్​ సరిహద్దుల్లో నాటుతుపాకీ కలకలం రేగింది. మంజీరా వంతెనపై మహారాష్ట్రకు చెంది ఇద్దరు వ్యక్తులు ఓ ఆటోడ్రైవర్​ మెడకు నాటుతుపాకీ గురిపెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు.

shotgun
shotgunGUN:నాటుతుపాకీతో ఆటో డ్రైవర్​కు బెదిరింపులు

నిజామాబాద్​- మహారాష్ట్ర సరిహద్దు సాలురా వంతెనపై నాటు తుపాకీ కలకలం రేగింది. బోధన్​కు చెందిన షేక్​గౌస్​ను మహారాష్ట్రకు చెందిన రామకిషన్​ నాటుతుపాకీతో బెదిరించారు. దుండగుల్లో ఒకరు పట్టుబడగా.. మరొక వ్యక్తి పరారయ్యాడు. రామకిషన్​ను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుపై తొలుత సందిగ్దం నెలకొన్నా.. చివరికి బోధన్​ రూరల్​ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

నిజామాబాద్ జిల్లా బోధన్​కు చెందిన గౌస్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్​. గురువారం.. బోధన్​ పాత బస్టాండ్​ నుంచి ఆటోలో సాలురా వెళ్లుండగా.. వాహనంలో ఇద్దరు మహారాష్ట్రవాసులు ఎక్కారు. సాలురా- మహారాష్ట్ర మధ్యనున్న మంజీరా వంతెనపైకి వెళ్లగానే రామకిషన్​తో పాటు మరో వ్యక్తి.. ఆటోడ్రైవర్​ గౌస్​ మెడకు నాటుతుపాకీ పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన గౌస్​, అతని స్నేహితుడు.. దుండగుల్లో ఒకరిని పట్టుకోగా.. మరో వ్యక్తి అక్కడ నుంచి పరారయ్యారు.

ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన రామకిషన్​ను బోధన్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు. కేసునమోదులో రూరల్​, పట్టణ పోలీసులు.. తొలుత తడబడినా.. చివరికి.. రూరల్​ పోలీసులే.. ఘటనా స్థలికి వెళ్లారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంలో దర్యాప్తు చేపట్టారు. అయితే బెదిరింపులకు గల కారణాలు తెలియరాలేదు.

ఇదీచూడండి: SUICIDE ATTEMPT: ఆర్థిక సమస్యలతో కుటుంబం ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్​- మహారాష్ట్ర సరిహద్దు సాలురా వంతెనపై నాటు తుపాకీ కలకలం రేగింది. బోధన్​కు చెందిన షేక్​గౌస్​ను మహారాష్ట్రకు చెందిన రామకిషన్​ నాటుతుపాకీతో బెదిరించారు. దుండగుల్లో ఒకరు పట్టుబడగా.. మరొక వ్యక్తి పరారయ్యాడు. రామకిషన్​ను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుపై తొలుత సందిగ్దం నెలకొన్నా.. చివరికి బోధన్​ రూరల్​ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

నిజామాబాద్ జిల్లా బోధన్​కు చెందిన గౌస్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్​. గురువారం.. బోధన్​ పాత బస్టాండ్​ నుంచి ఆటోలో సాలురా వెళ్లుండగా.. వాహనంలో ఇద్దరు మహారాష్ట్రవాసులు ఎక్కారు. సాలురా- మహారాష్ట్ర మధ్యనున్న మంజీరా వంతెనపైకి వెళ్లగానే రామకిషన్​తో పాటు మరో వ్యక్తి.. ఆటోడ్రైవర్​ గౌస్​ మెడకు నాటుతుపాకీ పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన గౌస్​, అతని స్నేహితుడు.. దుండగుల్లో ఒకరిని పట్టుకోగా.. మరో వ్యక్తి అక్కడ నుంచి పరారయ్యారు.

ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన రామకిషన్​ను బోధన్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు. కేసునమోదులో రూరల్​, పట్టణ పోలీసులు.. తొలుత తడబడినా.. చివరికి.. రూరల్​ పోలీసులే.. ఘటనా స్థలికి వెళ్లారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంలో దర్యాప్తు చేపట్టారు. అయితే బెదిరింపులకు గల కారణాలు తెలియరాలేదు.

ఇదీచూడండి: SUICIDE ATTEMPT: ఆర్థిక సమస్యలతో కుటుంబం ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.