ETV Bharat / crime

వ్యాపారి ఇంట్లో చోరీ.. బంగారు, వెండి ఆభరణాలు స్వాహా!

author img

By

Published : Jan 28, 2021, 7:00 AM IST

ఎవరు లేని సమయం చూసి.. గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాను పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశారు. ఈ ఘటన జమ్మికుంటలో చోటుచేసుకుంది.

Theft at the merchant's house gold and silver jewelery in jammikunta karimnagar
వ్యాపారి ఇంట్లో చోరీ.. బంగారు, వెండి ఆభరణాలు స్వాహా!

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పీఎస్​ పరిధిలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధిత కుటుంబీకులు వ్యక్తిగత పనులపై హైదరాబాద్​కు వెళ్లి వచ్చేసరికి దొంగలు ఇళ్లు గుల్ల చేశారు. 200గ్రాముల బంగారం, 600గ్రాముల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు వెల్లడించారు.

జమ్మికుంట పట్టణానికి చెందిన వ్యాపారి రవీందర్‌.. ఈ నెల 12న తన కుటుంబీకులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. తిరిగి స్వస్థలానికి చేరుకున్న బాధితులు.. ఇంట్లోకి దొంగలు చొరబడినట్లు గుర్తించారు. బీరువాను పగులగొట్టి.. బంగారు, వెండి నగలను ఎత్తుకెళ్లినట్లు తెలుసుకొని పోలీసులకు సమాచారమిచ్చారు.

సమాచారం అందుకున్న సీఐ సృజన్‌రెడ్డి తమ సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబీకులతో మాట్లాడి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: జంట హత్యల కేసు: వెలుగులోకి కొత్త నిజాలు..

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పీఎస్​ పరిధిలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధిత కుటుంబీకులు వ్యక్తిగత పనులపై హైదరాబాద్​కు వెళ్లి వచ్చేసరికి దొంగలు ఇళ్లు గుల్ల చేశారు. 200గ్రాముల బంగారం, 600గ్రాముల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు వెల్లడించారు.

జమ్మికుంట పట్టణానికి చెందిన వ్యాపారి రవీందర్‌.. ఈ నెల 12న తన కుటుంబీకులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. తిరిగి స్వస్థలానికి చేరుకున్న బాధితులు.. ఇంట్లోకి దొంగలు చొరబడినట్లు గుర్తించారు. బీరువాను పగులగొట్టి.. బంగారు, వెండి నగలను ఎత్తుకెళ్లినట్లు తెలుసుకొని పోలీసులకు సమాచారమిచ్చారు.

సమాచారం అందుకున్న సీఐ సృజన్‌రెడ్డి తమ సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబీకులతో మాట్లాడి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: జంట హత్యల కేసు: వెలుగులోకి కొత్త నిజాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.