ETV Bharat / crime

పీడీఎస్ బియ్యం పట్టివేత

నిర్మల్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్​పై కేసు నమోదుచేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Feb 14, 2021, 8:46 AM IST

seeze of illegally PDS rice in nirmal district
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని మామడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ బొలేరో వాహనం అనుమానంగా కనిపించడంతో.. తనిఖీ చేయగా 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి.

డ్రైవర్​పై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం తహసీల్దార్​కు అప్పగించినట్టు ఎస్సై వినయ్ పేర్కొన్నారు. ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని మామడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ బొలేరో వాహనం అనుమానంగా కనిపించడంతో.. తనిఖీ చేయగా 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి.

డ్రైవర్​పై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం తహసీల్దార్​కు అప్పగించినట్టు ఎస్సై వినయ్ పేర్కొన్నారు. ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: పీడీఎస్ బియ్యం పట్టివేత.. అదుపులోకి నిందితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.