ETV Bharat / crime

నడిరోడ్డుపైనే లంచం తీసుకున్న ఏఈ.. అరెస్టు చేసిన పోలీసులు - adilabad ae bribe case

ఆదిలాబాద్ పట్టణంలో నడిరోడ్డుపై లంచం తీసుకుంటున్న పంచాయతీ ఏఈని అనిశా అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అతని నుంచి రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

panchayat ae caught red handed while taking bribe in adilabad
నడిరోడ్డుపైనే లంచం తీసుకున్న ఏఈ
author img

By

Published : Jan 28, 2021, 1:14 PM IST

ఆదిలాబాద్​ పట్టణంలో అనిశా అధికారుల ఆకస్మిక తనిఖీ సంచలనం సృష్టించింది. సీసీ రహదారుల బిల్లు కోసం ఆదిలాబాద్ గ్రామీణ మండలం పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్​ రూ.2లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఏం చేయాలో పాలుపోని సదరు గుత్తేదారు.. అనిశా అధికారులను ఆశ్రయించారు.

అధికారులు చెప్పినట్లుగా సదరు గుత్తేదారు.. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని రెవెన్యూ గెస్ట్ ​హౌస్​ వద్దకు వెళ్లారు. అక్కడ.. ఏఈకి రెండు లక్షల రూపాయలు ఇస్తుండగా.. అనిశా అధికారులు చంద్రశేఖర్​ను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే.. నడిరోడ్డుపై అతణ్ని అరెస్టు చేశారు.

ఆదిలాబాద్​ పట్టణంలో అనిశా అధికారుల ఆకస్మిక తనిఖీ సంచలనం సృష్టించింది. సీసీ రహదారుల బిల్లు కోసం ఆదిలాబాద్ గ్రామీణ మండలం పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్​ రూ.2లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఏం చేయాలో పాలుపోని సదరు గుత్తేదారు.. అనిశా అధికారులను ఆశ్రయించారు.

అధికారులు చెప్పినట్లుగా సదరు గుత్తేదారు.. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని రెవెన్యూ గెస్ట్ ​హౌస్​ వద్దకు వెళ్లారు. అక్కడ.. ఏఈకి రెండు లక్షల రూపాయలు ఇస్తుండగా.. అనిశా అధికారులు చంద్రశేఖర్​ను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే.. నడిరోడ్డుపై అతణ్ని అరెస్టు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.