ETV Bharat / crime

మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌ ఆత్మహత్య, అసలేమైంది

author img

By

Published : Aug 28, 2022, 3:44 PM IST

office boy suicide in minister camp office తెలంగాణ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా మార్గంమధ్యలో చనిపోయాడు.

minister prashanth reddy camp office
minister prashanth reddy camp office

office boy suicide in minister camp office మంత్రి ప్రశాంత్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తున్న దేవేందర్‌ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వయసు 19 సంవత్సరాలు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో ఉన్న మంత్రి కార్యాలయంలోని ఓ గదిలో ఉరివేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా మార్గంమధ్యలో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

మృతిచెందిన యువకుడు ఓ మహిళతో సన్నిహితంగా మెలిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని ఆర్మూర్‌ ఏసీపీ చెప్పారు. ఆత్మహత్యకు ముందు తాను చనిపోతున్నట్లు యువకుడు ఆమెకు సందేశం పంపించినట్లు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు.

office boy suicide in minister camp office మంత్రి ప్రశాంత్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తున్న దేవేందర్‌ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వయసు 19 సంవత్సరాలు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో ఉన్న మంత్రి కార్యాలయంలోని ఓ గదిలో ఉరివేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా మార్గంమధ్యలో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

మృతిచెందిన యువకుడు ఓ మహిళతో సన్నిహితంగా మెలిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని ఆర్మూర్‌ ఏసీపీ చెప్పారు. ఆత్మహత్యకు ముందు తాను చనిపోతున్నట్లు యువకుడు ఆమెకు సందేశం పంపించినట్లు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.