ETV Bharat / crime

పాతకక్షలతో స్నేహితుడి మర్డర్..కేసును చేధించిన పోలీసులు - murder at jagadgirigutta news

మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్టలో ఈనెల 19న జరిగిన నవాజ్​ అనే యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షల నేపథ్యంలోనే స్నేహితుడు ఇమ్రాన్​ మరో ఇద్దరితో కలిసి హతమార్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు ముగ్గురినీ రిమాండ్​కు తరలించినట్లు స్పష్టం చేశారు.

jagadgirigutta murder case accused arrested
'కేసు ఛేదన: పాతకక్షలతో స్నేహితుడే నవాజ్​ను చంపాడు'
author img

By

Published : Mar 23, 2021, 11:53 AM IST

మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్టలో ఈనెల 19న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు ఇమ్రాన్​కు సహకరించిన మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

జగద్గిరిగుట్ట గిరినగర్​కు చెందిన నవాజ్, ఇమ్రాన్​లు స్నేహితులు. వీరి మధ్య గత కొంతకాలంగా చిన్న చిన్న తగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే నవాజ్​ను ఎలాగైనా అంతమొందించాలని ఇమ్రాన్ పథకం రచించాడు.

ఈనెల 19న శ్రీకాంత్, మురళి అనే మరో ఇద్దరితో కలిసి ఇమ్రాన్ నవాజ్​కు ఫోన్ చేశాడు. జగద్గిరిగుట్ట శ్రీనివాస్​నగర్​కు రావాల్సిందిగా కోరాడు. నవాజ్ అక్కడికి రాగానే.. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై కత్తితో పొడిచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు ఇమ్రాన్​ను అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకోగా.. పరారీలో ఉన్న స్నేహితులు శ్రీకాంత్, మురళిలను నేడు అదుపులోకి తీసుకున్నారు. ఏ2గా ఉన్న శ్రీకాంత్​పై గతంలో 15 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నేడు ముగ్గురినీ రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: నడిరోడ్డుపై కత్తితో దాడి.. ఆపై పరారీ..!

మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్టలో ఈనెల 19న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు ఇమ్రాన్​కు సహకరించిన మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

జగద్గిరిగుట్ట గిరినగర్​కు చెందిన నవాజ్, ఇమ్రాన్​లు స్నేహితులు. వీరి మధ్య గత కొంతకాలంగా చిన్న చిన్న తగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే నవాజ్​ను ఎలాగైనా అంతమొందించాలని ఇమ్రాన్ పథకం రచించాడు.

ఈనెల 19న శ్రీకాంత్, మురళి అనే మరో ఇద్దరితో కలిసి ఇమ్రాన్ నవాజ్​కు ఫోన్ చేశాడు. జగద్గిరిగుట్ట శ్రీనివాస్​నగర్​కు రావాల్సిందిగా కోరాడు. నవాజ్ అక్కడికి రాగానే.. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై కత్తితో పొడిచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు ఇమ్రాన్​ను అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకోగా.. పరారీలో ఉన్న స్నేహితులు శ్రీకాంత్, మురళిలను నేడు అదుపులోకి తీసుకున్నారు. ఏ2గా ఉన్న శ్రీకాంత్​పై గతంలో 15 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నేడు ముగ్గురినీ రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: నడిరోడ్డుపై కత్తితో దాడి.. ఆపై పరారీ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.