ETV Bharat / crime

సైబర్ మాయజాలం.. స్నేహితుల పేరిట అడ్డంగా ​'బుక్'!

ఫైస్​బుక్​ను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ ఖాతాలు సృష్టించి మిత్రులకు సందేశాలు పంపుతున్నారు. డబ్బులు అత్యవసరమంటూ వేడుకుంటున్నారు. మిత్రుడు ఆపదలో ఉన్నాడేమోనని ఏమీ ఆలోచించకుండా డబ్బులు పంపిస్తున్నారు కొందరు. ఆ తర్వాత నిజం తెలిసి తలలు పట్టుకుంటున్నారు.

author img

By

Published : May 25, 2021, 10:05 AM IST

cyber crimes in medchal, face book cyber crimes
సైబర్​నేరాలు, ఫేస్​బుక్​తో సైబర్ మోసాలు

నకిలీ ఫేస్​బుక్ ఖాతాలను సృష్టించి ఓ వ్యక్తి నుంచి రూ.2.85 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ.10వేలను సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరిగింది. దూలపల్లికి చెందిన శ్రీనివాసులు పేరిట నకిలీ ఫేస్​బుక్ ఖాతాను సృష్టించి... అత్యవసరంగా డబ్బులు అవసరమున్నాయని తన స్నేహితులకు సందేశాలు పంపించారని బాధితుడు తెలిపారు. తన మిత్రుడు శ్యామ్ రెడ్డి రూ.2.85 లక్షలు ఇచ్చినట్లు వాపోయారు. అనంతరం నగదు పంపానని ఫోన్ చేయగా విషయం తెలిసిందని చెప్పాడు.

అదే జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన దినేష్ రెడ్డిని ఫేస్​బుక్​లో తన స్నేహితుడి పేరిట సైబర్ నేరగాళ్లు డబ్బులు అడిగారని బాధితుడు తెలిపారు. రూ.30వేలు అడగడంతో రూ.10వేలు ఇచ్చానని చెప్పారు. అనంతరం తన మిత్రుడి ఫేస్​బుక్​ను హ్యాక్ చేసినట్లు గుర్తించినట్లు వాపోయారు. పై రెండు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.

నకిలీ ఫేస్​బుక్ ఖాతాలను సృష్టించి ఓ వ్యక్తి నుంచి రూ.2.85 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ.10వేలను సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరిగింది. దూలపల్లికి చెందిన శ్రీనివాసులు పేరిట నకిలీ ఫేస్​బుక్ ఖాతాను సృష్టించి... అత్యవసరంగా డబ్బులు అవసరమున్నాయని తన స్నేహితులకు సందేశాలు పంపించారని బాధితుడు తెలిపారు. తన మిత్రుడు శ్యామ్ రెడ్డి రూ.2.85 లక్షలు ఇచ్చినట్లు వాపోయారు. అనంతరం నగదు పంపానని ఫోన్ చేయగా విషయం తెలిసిందని చెప్పాడు.

అదే జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన దినేష్ రెడ్డిని ఫేస్​బుక్​లో తన స్నేహితుడి పేరిట సైబర్ నేరగాళ్లు డబ్బులు అడిగారని బాధితుడు తెలిపారు. రూ.30వేలు అడగడంతో రూ.10వేలు ఇచ్చానని చెప్పారు. అనంతరం తన మిత్రుడి ఫేస్​బుక్​ను హ్యాక్ చేసినట్లు గుర్తించినట్లు వాపోయారు. పై రెండు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: నదిలో మునిగిన నాటుపడవలు.. 8 మంది గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.