ETV Bharat / crime

విషం తీసుకున్న దంపతులు.. భార్య మృతి, భర్తకు సీరియస్

ఓ దంపతులకు అనారోగ్యం, ఆర్థిక సమస్యలు అధికమయ్యాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన భర్త .. భార్యకు విషం ఇచ్చి తాను కూడా తీసుకున్నాడు. భార్య మరణించగా.. భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్​లోని రహమత్ నగర్​లో చోటుచేసుకుంది.

author img

By

Published : Mar 12, 2021, 7:10 PM IST

Updated : Mar 12, 2021, 7:48 PM IST

Couple commits suicide attempt by taking poison at rahmat nagar
విషం తీసుకుని దంపతులు ఆత్మహత్యాయత్నం

అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా మారింది. హైదరాబాద్​లోని రహమత్ నగర్​లో నివసించే సుబ్బారావు, సాయి లక్ష్మి భార్యా-భర్తలు. సాయి లక్ష్మి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా... ఇటీవలే బ్రెయిన్ సర్జరీ చేయించారు. ఇటూ అనారోగ్య సమస్యలు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని వెంటాడాయి. తట్టుకోలేని భర్త తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడు.

అనారోగ్యంతో బాధ పడుతున్న భార్యను పంజాగుట్టలోని స్వరాజ్ రిహాబిలిటేషన్ సెంటర్​లో చేర్చాడు. పరిస్థితి మరింత విషమించడంతో భార్యకు గుర్తుతెలియని విషం ఇచ్చి తాను కూడా సేవించాడు. ఆమె మృతి చెందగా.. భర్త సుబ్బారావు అపస్మారక స్థితిలోకి చేరాడు.

ఆ కేంద్రం నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు వారి కుమార్తె ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లి మృతి చెందినట్లు గుర్తించారు. అపస్మారకస్థితిలో ఉన్న తండ్రిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారు ఉన్న గదిలో సూసైడ్ లెటర్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : మొబైల్​ నెట్​వర్క్​ మోసం.. లక్షలు స్వాహా..

అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా మారింది. హైదరాబాద్​లోని రహమత్ నగర్​లో నివసించే సుబ్బారావు, సాయి లక్ష్మి భార్యా-భర్తలు. సాయి లక్ష్మి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా... ఇటీవలే బ్రెయిన్ సర్జరీ చేయించారు. ఇటూ అనారోగ్య సమస్యలు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని వెంటాడాయి. తట్టుకోలేని భర్త తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడు.

అనారోగ్యంతో బాధ పడుతున్న భార్యను పంజాగుట్టలోని స్వరాజ్ రిహాబిలిటేషన్ సెంటర్​లో చేర్చాడు. పరిస్థితి మరింత విషమించడంతో భార్యకు గుర్తుతెలియని విషం ఇచ్చి తాను కూడా సేవించాడు. ఆమె మృతి చెందగా.. భర్త సుబ్బారావు అపస్మారక స్థితిలోకి చేరాడు.

ఆ కేంద్రం నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు వారి కుమార్తె ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లి మృతి చెందినట్లు గుర్తించారు. అపస్మారకస్థితిలో ఉన్న తండ్రిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారు ఉన్న గదిలో సూసైడ్ లెటర్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : మొబైల్​ నెట్​వర్క్​ మోసం.. లక్షలు స్వాహా..

Last Updated : Mar 12, 2021, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.