ETV Bharat / crime

కరోనా కాటు: పెళ్లైన 13 రోజులకే నవ వరుడు మృతి

author img

By

Published : May 25, 2021, 11:04 PM IST

పెళ్లైన 13 రోజులకే కరోనాతో నవ వరుడు మృతి చెందిన విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లైన 3 రోజులకే వైరస్​ బారినపడగా.. హైదరాబాద్​లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

పెళ్లైన 13 రోజులకే నవ వరుడు మృతి
పెళ్లైన 13 రోజులకే నవ వరుడు మృతి

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యమపూర్ గ్రామానికి చెందిన చింతకుంట కృష్ణంరాజు అనే యువకుడికి ఈ నెల 13న వివాహం జరిగింది. పెళ్లి అయిన 3 రోజులకు కరోనా లక్షణాలు కనిపించడంతో కుటుంబసభ్యులంతా పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

అప్పటి నుంచి అందరూ ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే రాజుకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో రాజు మంగళవారం మరణించాడు. పెళ్లైన 13 రోజులకే నవ వరుడు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యమపూర్ గ్రామానికి చెందిన చింతకుంట కృష్ణంరాజు అనే యువకుడికి ఈ నెల 13న వివాహం జరిగింది. పెళ్లి అయిన 3 రోజులకు కరోనా లక్షణాలు కనిపించడంతో కుటుంబసభ్యులంతా పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

అప్పటి నుంచి అందరూ ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే రాజుకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో రాజు మంగళవారం మరణించాడు. పెళ్లైన 13 రోజులకే నవ వరుడు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఇదీ చూడండి: చనిపోయిన వ్యక్తిలో కరోనా ఎంతసేపు ఉంటుంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.