ETV Bharat / crime

పనిచేస్తుండగా పేలిన ల్యాప్​టాప్​.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి

Software employee died in Laptop explosion: ఏపీలోని వైఎస్సార్​ జిల్లా బి.కోడూరు మండలం మేకవారిపల్లి గ్రామంలో వర్క్ ఫ్రం హోమ్​లో భాగంగా విధులు నిర్వహిస్తూ ల్యాప్​టాప్​ పేలడంతో గాయపడిన ఉద్యోగిని చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామానికి చెందిన సాఫ్ట్​వేర్ ఉద్యోగిని సుమతి.. ఇంటి దగ్గరే విధులు నిర్వహిస్తోంది. ల్యాప్​టాప్​​కు ఛార్జింగ్​ పెట్టి ఒడిలో పెట్టుకుని పని చేస్తుండగా ఒక్కసారిగా పేలింది. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.

author img

By

Published : Apr 23, 2022, 2:30 PM IST

Software employee died in Laptop explosion
ల్యాప్‌టాప్‌ పేలుడు ఘటనలో గాయపడిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి

Software employee died in Laptop explosion: ఆంధ్రప్రదేశ్​లో ఈ నెల 18న ల్యాప్‌టాప్‌ పేలి తీవ్రంగా గాయపడిన సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని సుమతి మృతి చెందింది. వైఎస్సార్‌ జిల్లా బి. కోడూరు మండలం మేకవారిపల్లె గ్రామానికి చెందిన సిద్దు సుమలత (22).. తిరుపతిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.

Software employee died in Laptop explosion
సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని సుమతి

సంబంధిత వార్త: పనిచేస్తుండగా పేలిన ల్యాప్​టాప్​.. సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని పరిస్థితి విషమం

మండల పరిషత్తు మాజీ ఉపాధ్యక్షుడు, తెదేపా నాయకుడు సిద్దు వెంకటసుబ్బారెడ్డి, లక్ష్మీనరసమ్మ దంపతుల రెండో కుమార్తె సుమతి.. బెంగళూరులోని ఒక సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఈ నెల 18న తన ఇంట్లో మంచంపై కూర్చొని విధులు నిర్వహిస్తుండగా.. ఛార్జింగ్‌ పెట్టిన ల్యాప్‌టాప్‌ ఒక్కసారిగా పేలింది. పరుపు, మంచానికి మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా సుమతి ఉద్యోగంలో చేరి మూడునెలలే అయింది.

ఇవీ చదవండి: 'నిన్ననే కొన్నారు.. ఇవాళ పేలింది.. ఒకరు చనిపోయారు'

No Ball Controversy: 'అది కరెక్ట్‌ కాదు కానీ.. మాకూ అన్యాయం జరిగింది'

Software employee died in Laptop explosion: ఆంధ్రప్రదేశ్​లో ఈ నెల 18న ల్యాప్‌టాప్‌ పేలి తీవ్రంగా గాయపడిన సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని సుమతి మృతి చెందింది. వైఎస్సార్‌ జిల్లా బి. కోడూరు మండలం మేకవారిపల్లె గ్రామానికి చెందిన సిద్దు సుమలత (22).. తిరుపతిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.

Software employee died in Laptop explosion
సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని సుమతి

సంబంధిత వార్త: పనిచేస్తుండగా పేలిన ల్యాప్​టాప్​.. సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని పరిస్థితి విషమం

మండల పరిషత్తు మాజీ ఉపాధ్యక్షుడు, తెదేపా నాయకుడు సిద్దు వెంకటసుబ్బారెడ్డి, లక్ష్మీనరసమ్మ దంపతుల రెండో కుమార్తె సుమతి.. బెంగళూరులోని ఒక సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఈ నెల 18న తన ఇంట్లో మంచంపై కూర్చొని విధులు నిర్వహిస్తుండగా.. ఛార్జింగ్‌ పెట్టిన ల్యాప్‌టాప్‌ ఒక్కసారిగా పేలింది. పరుపు, మంచానికి మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా సుమతి ఉద్యోగంలో చేరి మూడునెలలే అయింది.

ఇవీ చదవండి: 'నిన్ననే కొన్నారు.. ఇవాళ పేలింది.. ఒకరు చనిపోయారు'

No Ball Controversy: 'అది కరెక్ట్‌ కాదు కానీ.. మాకూ అన్యాయం జరిగింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.