భవిష్యత్లో పిల్లలు అంగ వైకల్యంతో బాధ పడకూడదంటే వారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లాలోని దుబ్బ ప్రాంతంలో గల అర్బన్ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ బాధ్యతగా వారి తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ సారి జిల్లాలో 1.83 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఇందుకు గాను 1700 కేంద్రాలు ఏర్పాటు చేశామన్న కలెక్టర్ సుమారు 4300 మంది సిబ్బంది ఈ విధులలో పాల్గొంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శివశంకర్, హెల్త్ ఎడ్యుకేటర్ వేణుగోపాల్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ట్రామాకేర్ సెంటర్గా శామీర్పేట్ ఆస్పత్రి : ఈటల