ETV Bharat / city

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయం: జగదీశ్ రెడ్డి - ఓటరు నమోదు అవగాహన సదస్సులో మంత్రి జగదీశ్ రెడ్డి

నల్గొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నహాక సమావేశం నిర్వహించారు. మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్​ నియోజకవర్గం నుంచి తెరాస ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

minister jagadih reddy attend to graduate mlc voter registration awareness  meeting in nalgonda
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధిస్తుంది: జగదీశ్ రెడ్డి
author img

By

Published : Oct 22, 2020, 1:03 PM IST


నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధిస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అన్ని వర్గాల ప్రజల్లో ప్రభుత్వం, కేసీఆర్​ పట్ల సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఈ ఏడేళ్లలో ఏ ఎన్నికలు వచ్చినా తెరాస తిరుగులేని మెజార్టీతో గెలిచిందన్నారు. ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుందని... కావాలనే కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు.

ఓటరు నమోదుపై పట్టభద్రుల్లో అవగాహన కల్పించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్​రావు, బడుగుల లింగయ్య యాదవ్​, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మున్సిపల్​ ఛైర్మన్​ మందడి సైదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధిస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అన్ని వర్గాల ప్రజల్లో ప్రభుత్వం, కేసీఆర్​ పట్ల సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఈ ఏడేళ్లలో ఏ ఎన్నికలు వచ్చినా తెరాస తిరుగులేని మెజార్టీతో గెలిచిందన్నారు. ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుందని... కావాలనే కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు.

ఓటరు నమోదుపై పట్టభద్రుల్లో అవగాహన కల్పించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్​రావు, బడుగుల లింగయ్య యాదవ్​, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మున్సిపల్​ ఛైర్మన్​ మందడి సైదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,456 కరోనా కేసులు, 5 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.