మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని గూరకొండ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండన్న అనే వ్యక్తి కట్టుకున్న పెళ్లాన్ని గొడ్డలితో నరికి చంపాడు. కొండన్నకు ఇద్దరు భార్యలున్నారు. అందులో మెదటి భార్యకు పిల్లలు కల్గనందున రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఈ విషయంలోనే మొదటి భార్యకీ కొండన్నకి తరచూ గొడవలు జరుగుతున్నాయి. నిన్న గొడవ కొంచెం ఎక్కువ కావడంతో కొండన్న కోపంలో భార్యని నరికి చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మహిళ హత్యకు గురి కావడం వల్ల గురుకొండ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఇవీ చూడండి: పసికందు దేహంతో పీఎస్కు మహిళ.. భర్తపై ఫిర్యాదు