ETV Bharat / city

Heavy rain in karimnagar : కాసేపే కుండపోత వర్షం.. ఆలోపే నగరమంతా జలమయం

author img

By

Published : Sep 6, 2021, 12:27 PM IST

కరీంనగర్​లో ఆదివారం కురిసిన వర్షాని(Heavy rain in karimnagar)కి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కురిసింది కాసేపే అయినా భారీగా కురవడం వల్ల చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులపైకి మురుగు నీరు చేరి చెరువును తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కరీంనగర్​ జలమయం
కరీంనగర్​ జలమయం

కరీంనగర్​ జలమయం

కరీంనగర్​లో ఆదివారం రోజున భారీ వర్షం(Heavy rain in karimnagar) కురిసింది. నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి మురుగు నీరు చేరి చెరువును తలపించాయి. విద్యానగర్, రాంనగర్, జ్యోతి నగర్, ముకరంపుర, శ్రీనగర్ కాలనీల్లోని ప్రధాన రహదారులు నీటమునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శాతవాహన యూనివర్సిటీ రోడ్డులో సెయింట్ జాన్స్ పాఠశాల ఎదురుగా ఉన్న ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ముకరంపుర, సిరిసిల్ల బస్ స్టాప్ ఎదురుగా డ్రైనేజీ నీరంతా రోడ్డు పైకి వచ్చింది. భగత్​నగర్ కట్ట, రాంపూర్ వీధులు జలమయమయ్యాయి. సిరిసిల్ల రోడ్డులోని పద్మా నగర్, రామ్ నగర్ ప్రధాన రహదారిపై నీరు నిలవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్మార్ట్ సిటీ పనులు అసంపూర్తిగా వదిలేయడం వల్ల, మురుగునీటి కాలువలు అనుసంధానం చేయకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తాయని స్థానికులు ఆరోపించారు.

లోతట్టు ప్రాంతాలను కరీంనగర్ నగర పాలక మేయర్ సునీల్ రావు.. కమిషనర్ అగర్వాల్​తో కలిసి పరిశీలించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం వల్లే మురుగు కాలువలు పొంగిపొర్లి రహదారులపై నీరు చేరిందని మేయర్ అన్నారు.

"స్మార్ట్ సిటీ పనులు జరుగుతుండటం వల్ల వరద నీరు రహదారులపైకి చేరుతోంది. కొద్దిసేపే కురిసినా.. భారీగా పడటం వల్ల వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. వర్షం కురిసినప్పుడు నగర ప్రజలు ఇలాంటి సమస్యలు మళ్లీ ఎదుర్కోకుండా చర్యలు తీసుకుంటాం. ఇప్పటి సమస్యలను పరిశీలించి.. కార్యాచరణ రూపొందిస్తాం. రాబోయే రోజుల్లో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూసుకుంటాం."

- సునీల్ రావు, కరీంనగర్ మేయర్

స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా.. ప్లాన్ లేకుండా మురుగు కాలువలు నిర్మించడం వల్లే నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని ప్రజలు అభిప్రాయపడ్డారు. కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తున్నా తమకు సమస్యలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కరీంనగర్​ జలమయం

కరీంనగర్​లో ఆదివారం రోజున భారీ వర్షం(Heavy rain in karimnagar) కురిసింది. నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి మురుగు నీరు చేరి చెరువును తలపించాయి. విద్యానగర్, రాంనగర్, జ్యోతి నగర్, ముకరంపుర, శ్రీనగర్ కాలనీల్లోని ప్రధాన రహదారులు నీటమునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శాతవాహన యూనివర్సిటీ రోడ్డులో సెయింట్ జాన్స్ పాఠశాల ఎదురుగా ఉన్న ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ముకరంపుర, సిరిసిల్ల బస్ స్టాప్ ఎదురుగా డ్రైనేజీ నీరంతా రోడ్డు పైకి వచ్చింది. భగత్​నగర్ కట్ట, రాంపూర్ వీధులు జలమయమయ్యాయి. సిరిసిల్ల రోడ్డులోని పద్మా నగర్, రామ్ నగర్ ప్రధాన రహదారిపై నీరు నిలవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్మార్ట్ సిటీ పనులు అసంపూర్తిగా వదిలేయడం వల్ల, మురుగునీటి కాలువలు అనుసంధానం చేయకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తాయని స్థానికులు ఆరోపించారు.

లోతట్టు ప్రాంతాలను కరీంనగర్ నగర పాలక మేయర్ సునీల్ రావు.. కమిషనర్ అగర్వాల్​తో కలిసి పరిశీలించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం వల్లే మురుగు కాలువలు పొంగిపొర్లి రహదారులపై నీరు చేరిందని మేయర్ అన్నారు.

"స్మార్ట్ సిటీ పనులు జరుగుతుండటం వల్ల వరద నీరు రహదారులపైకి చేరుతోంది. కొద్దిసేపే కురిసినా.. భారీగా పడటం వల్ల వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. వర్షం కురిసినప్పుడు నగర ప్రజలు ఇలాంటి సమస్యలు మళ్లీ ఎదుర్కోకుండా చర్యలు తీసుకుంటాం. ఇప్పటి సమస్యలను పరిశీలించి.. కార్యాచరణ రూపొందిస్తాం. రాబోయే రోజుల్లో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూసుకుంటాం."

- సునీల్ రావు, కరీంనగర్ మేయర్

స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా.. ప్లాన్ లేకుండా మురుగు కాలువలు నిర్మించడం వల్లే నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని ప్రజలు అభిప్రాయపడ్డారు. కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తున్నా తమకు సమస్యలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.