ETV Bharat / city

అనవసరంగా బయటకొస్తే ఉపేక్షించం: కలెక్టర్​

ప్రమాదకర జోన్​గా ప్రకటించిన ప్రాంతం నుంచి ఎవరూ బయటకు రావొద్దని కరీంనగర్​ కలెక్టర్​ శశాంక హెచ్చరించారు. ఆయా ప్రాంతాల ప్రజలకు అత్యవసరమయ్యే అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికొచ్చినా ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. అన్ని జిల్లాల కంటే కరీంనగర్​కే ఎక్కువ ముప్పు ఉందని సీపీ కమలాసన్​రెడ్డి తెలిపారు. అధికార యంత్రాంగం, పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.

author img

By

Published : Mar 25, 2020, 12:39 PM IST

karimnagar
అనవసరంగా బయటకొస్తే ఉపేక్షించం: కలెక్టర్​

కరీంనగర్‌లో ప్రమాదకర జోన్‌గా ప్రకటించిన ప్రాంతం నుంచి ఎవరూ బయటకు రావొద్దని కలెక్టర్​ శశాంక ఆదేశించారు. ఆ ప్రాంతంలోని ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మంగళవారం 1500 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించేందుకు కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కరీంనగర్ వాసులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని.. వాటిని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అత్యవసర సేవల కోసం మాత్రమే ప్రజలకు అనుమతి ఇస్తున్నట్లు కలెక్టర్ శశాంక వెల్లడించారు. అనవసరంగా బయటకు వస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిత్యవసర సరుకులు విక్రయించే కిరాణా దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించాలని సూచించారు.

కొంతమందికి కరీంనగర్‌లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామన్న కలెక్టర్.. కరోనా అనుమానితులను 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నట్లు స్పష్టం చేశారు.

జాబితా సిద్ధం..

ఇండోనేసియా వాసులను కలిసిన వారి జాబితాను సిద్ధం చేశామని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. మిగతా జిల్లాల కంటే కరీంనగర్​లోనే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు. ఈరోజు నుంచి నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తామన్నారు.

జేసీ శ్యామ్​ప్రసాద్​రెడ్డి, మున్సిపల్​ కమిషనర్​ క్రాంతి, డీఎంహెచ్​వో సుజాత పాల్గొన్నారు.

అనవసరంగా బయటకొస్తే ఉపేక్షించం: కలెక్టర్​

ఇవీచూడండి: కరీంనగర్​ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్

కరీంనగర్‌లో ప్రమాదకర జోన్‌గా ప్రకటించిన ప్రాంతం నుంచి ఎవరూ బయటకు రావొద్దని కలెక్టర్​ శశాంక ఆదేశించారు. ఆ ప్రాంతంలోని ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మంగళవారం 1500 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించేందుకు కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కరీంనగర్ వాసులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని.. వాటిని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అత్యవసర సేవల కోసం మాత్రమే ప్రజలకు అనుమతి ఇస్తున్నట్లు కలెక్టర్ శశాంక వెల్లడించారు. అనవసరంగా బయటకు వస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిత్యవసర సరుకులు విక్రయించే కిరాణా దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించాలని సూచించారు.

కొంతమందికి కరీంనగర్‌లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామన్న కలెక్టర్.. కరోనా అనుమానితులను 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నట్లు స్పష్టం చేశారు.

జాబితా సిద్ధం..

ఇండోనేసియా వాసులను కలిసిన వారి జాబితాను సిద్ధం చేశామని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. మిగతా జిల్లాల కంటే కరీంనగర్​లోనే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు. ఈరోజు నుంచి నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తామన్నారు.

జేసీ శ్యామ్​ప్రసాద్​రెడ్డి, మున్సిపల్​ కమిషనర్​ క్రాంతి, డీఎంహెచ్​వో సుజాత పాల్గొన్నారు.

అనవసరంగా బయటకొస్తే ఉపేక్షించం: కలెక్టర్​

ఇవీచూడండి: కరీంనగర్​ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.