ETV Bharat / city

YS Sharmila: 'వైఎస్సార్​ జయంతి రోజున పార్టీ ప్రకటన'

author img

By

Published : Jun 30, 2021, 2:58 PM IST

Updated : Jun 30, 2021, 3:34 PM IST

ysrtp, ysrtp announcment, ys sharmila
వైఎస్సార్​టీపీ, ఆరోజే వైఎస్సార్​టీపీ ప్రకటన, వైఎస్ షర్మిల

13:34 June 30

రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా కొత్త పార్టీ: షర్మిల

'వైఎస్సార్​ జయంతి రోజున పార్టీ ప్రకటన'

తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడిని తీసుకువచ్చి... పీసీసీ అధ్యక్షుడిని చేసే దుస్థితికి కాంగ్రెస్‌ చేరిందని వైఎస్​ షర్మిల విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు జులై 8న వైఎస్సార్​ జయంతి సందర్భంగా... రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు షర్మిల తెలిపారు. రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా వైఎస్‌ఆర్‌టీపీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌టీపీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం అన్నీ ఉచితమని షర్మిల ప్రకటించారు.  

హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో 'టీమ్‌ వైస్​ఎస్సార్​' వెబ్‌సైట్​ను షర్మిల ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో ఉన్న నాలుగుస్తంభాల్లో ఏ ఒక్క వ్యవస్థ సరిగ్గా పని చేయకపోయినా... ప్రశ్నించి సరైన మార్గంలో పెట్టేలా చేసే ఐదో స్తంభంగా సోషల్​ మీడియా మారిందని షర్మిల అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమం ప్రజల చేతుల్లో ఉన్న ఆయుధంగా ఆమె అభివర్ణించారు. 

"ప్రజల గొంతు నేరుగా వినిపించేందుకు సోషల్​ మీడియానే సరైన వేదికగా మారుతోంది. ప్రత్యేకంగా ఉద్యోగులతో తెరాస, కాంగ్రెస్‌ పార్టీలు సోషల్‌ మీడియాను నడుపుతున్నాయి. మన పార్టీకి సోషల్​ మీడియా ఎంప్లాయిస్​ ఉండరు... వైఎస్​ అభిమానులే వారియర్స్‌గా పనిచేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి సోషల్ మీడియా అత్యంత కీలకం. అందులో కార్యకర్తలే ముందుండాలి."

- వైఎస్​ షర్మిల

13:34 June 30

రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా కొత్త పార్టీ: షర్మిల

'వైఎస్సార్​ జయంతి రోజున పార్టీ ప్రకటన'

తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడిని తీసుకువచ్చి... పీసీసీ అధ్యక్షుడిని చేసే దుస్థితికి కాంగ్రెస్‌ చేరిందని వైఎస్​ షర్మిల విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు జులై 8న వైఎస్సార్​ జయంతి సందర్భంగా... రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు షర్మిల తెలిపారు. రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా వైఎస్‌ఆర్‌టీపీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌టీపీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం అన్నీ ఉచితమని షర్మిల ప్రకటించారు.  

హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో 'టీమ్‌ వైస్​ఎస్సార్​' వెబ్‌సైట్​ను షర్మిల ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో ఉన్న నాలుగుస్తంభాల్లో ఏ ఒక్క వ్యవస్థ సరిగ్గా పని చేయకపోయినా... ప్రశ్నించి సరైన మార్గంలో పెట్టేలా చేసే ఐదో స్తంభంగా సోషల్​ మీడియా మారిందని షర్మిల అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమం ప్రజల చేతుల్లో ఉన్న ఆయుధంగా ఆమె అభివర్ణించారు. 

"ప్రజల గొంతు నేరుగా వినిపించేందుకు సోషల్​ మీడియానే సరైన వేదికగా మారుతోంది. ప్రత్యేకంగా ఉద్యోగులతో తెరాస, కాంగ్రెస్‌ పార్టీలు సోషల్‌ మీడియాను నడుపుతున్నాయి. మన పార్టీకి సోషల్​ మీడియా ఎంప్లాయిస్​ ఉండరు... వైఎస్​ అభిమానులే వారియర్స్‌గా పనిచేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి సోషల్ మీడియా అత్యంత కీలకం. అందులో కార్యకర్తలే ముందుండాలి."

- వైఎస్​ షర్మిల

Last Updated : Jun 30, 2021, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.