ETV Bharat / city

నగర అభివృద్ధిపై ఎప్పుడైనా పార్లమెంట్​లో మాట్లాడారా? : ఎంపీ నామ

author img

By

Published : Nov 27, 2020, 12:16 PM IST

Updated : Nov 27, 2020, 12:25 PM IST

హైదరాబాద్​ అభివృద్ధిపై భాజపా ఎప్పుడైనా పార్లమెంట్​లో ప్రస్తావించిందా అని తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రశ్నించారు. కాషాయ నేతలు అబద్ధాలు, మోసపూరిత మాటలు చెబుతున్నారని ఆరోపించారు.

MP Nama Nageswararao
ఎంపీ నామ నాగేశ్వరరావు

కేంద్ర నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులపై లెక్కలు చెబుతామని ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ నుంచి వెళ్లే పన్నులను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారని తెలంగాణ భవన్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆరోపించారు. రాష్ట్రం నుంచి వెళ్తున్న డబ్బుపైనే కేంద్రం బతుకుతుందని, కేంద్ర నిధులతో తెలంగాణ బతకడం లేదని స్పష్టం చేశారు.

వరదల సమయంలో సాయం చేసేందుకు రాని కేంద్ర మంత్రులంతా జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసం హైదరాబాద్​కు వస్తున్నారని నామ అన్నారు. ఆరేళ్లలో రాష్ట్రానికి, నగరానికి ఏం చేశారో భాజపా నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు లేఖలు రాసినా.. కనీసం ఒక్క ప్రాజెక్టు కేటాయించలేదని మండిపడ్డారు. ఐఐటీ, నవోదయ పాఠశాలలను కూడా ఇవ్వలేదని, పార్లమెంట్​లో ఎన్నిసార్లు మాట్లాడినా కేంద్రం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులపై లెక్కలు చెబుతామని ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ నుంచి వెళ్లే పన్నులను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారని తెలంగాణ భవన్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆరోపించారు. రాష్ట్రం నుంచి వెళ్తున్న డబ్బుపైనే కేంద్రం బతుకుతుందని, కేంద్ర నిధులతో తెలంగాణ బతకడం లేదని స్పష్టం చేశారు.

వరదల సమయంలో సాయం చేసేందుకు రాని కేంద్ర మంత్రులంతా జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసం హైదరాబాద్​కు వస్తున్నారని నామ అన్నారు. ఆరేళ్లలో రాష్ట్రానికి, నగరానికి ఏం చేశారో భాజపా నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు లేఖలు రాసినా.. కనీసం ఒక్క ప్రాజెక్టు కేటాయించలేదని మండిపడ్డారు. ఐఐటీ, నవోదయ పాఠశాలలను కూడా ఇవ్వలేదని, పార్లమెంట్​లో ఎన్నిసార్లు మాట్లాడినా కేంద్రం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Last Updated : Nov 27, 2020, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.