హైదరాబాద్ కూకట్పల్లి-హైటెక్ సిటీ మార్గంలో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్తుండగా... అదుపు తప్పి మలేసియా టౌన్షిప్కు ఎదురుగా ఉన్న డివైడర్ను ఢీ కొట్టింది. 10 మీటర్ల మేర డివైడర్ ధ్వంసం అయ్యింది. రాత్రి సమయం కావటం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఈ మార్గంలో అనుమతులకు విరుద్దంగా నడుస్తున్న టిప్పర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా... స్పందన కరువైందని వాపోయారు.
ఇదీ చూడండి: టీ-కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు!