ETV Bharat / city

కరోనా పరీక్షల ధరలను తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం

author img

By

Published : Dec 22, 2020, 5:43 PM IST

Updated : Dec 22, 2020, 10:48 PM IST

corona test
corona test

17:42 December 22

కరోనా పరీక్షల ధరలను తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం

కొవిడ్ నిర్ధరణ పరీక్షల రుసుమును రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రయోగశాలలు, ఆసుపత్రుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షకు గతంలో ఉన్న రూ.850 రుసుమును రూ.500కు తగ్గించింది. ఇంటి దగ్గర నమూనాలు సేకరించి చేసే పరీక్షల రుసుమును రూ.1200 నుంచి రూ.750కి తగ్గించింది. పీసీఈ కిట్లు, ఇతరత్రాలను కలుపుకొని ఈ ధరలను ఖరారు చేశారు.  

కిట్ల లభ్యత పెరగడంతో పాటు పరీక్షా వ్యయం తగ్గిన నేపథ్యంలో కరోనా నిర్ధరణ పరీక్షల ధరలను ప్రభుత్వం తగ్గించింది. ఆసుపత్రులు, ల్యాబులన్నీ కొత్త ధరలను విధిగా అమలు చేయాలన్న ప్రభుత్వం... ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  

ఇదీ చదవండి : '6 వారాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్‌కు టీకా!'

17:42 December 22

కరోనా పరీక్షల ధరలను తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం

కొవిడ్ నిర్ధరణ పరీక్షల రుసుమును రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రయోగశాలలు, ఆసుపత్రుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షకు గతంలో ఉన్న రూ.850 రుసుమును రూ.500కు తగ్గించింది. ఇంటి దగ్గర నమూనాలు సేకరించి చేసే పరీక్షల రుసుమును రూ.1200 నుంచి రూ.750కి తగ్గించింది. పీసీఈ కిట్లు, ఇతరత్రాలను కలుపుకొని ఈ ధరలను ఖరారు చేశారు.  

కిట్ల లభ్యత పెరగడంతో పాటు పరీక్షా వ్యయం తగ్గిన నేపథ్యంలో కరోనా నిర్ధరణ పరీక్షల ధరలను ప్రభుత్వం తగ్గించింది. ఆసుపత్రులు, ల్యాబులన్నీ కొత్త ధరలను విధిగా అమలు చేయాలన్న ప్రభుత్వం... ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  

ఇదీ చదవండి : '6 వారాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్‌కు టీకా!'

Last Updated : Dec 22, 2020, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.