ETV Bharat / city

ప్రసాదంపాడు ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద.. తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు!

author img

By

Published : Mar 23, 2022, 4:05 PM IST

విజయవాడలోని ప్రసాదంపాడు ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నాటుసారా మరణాలపై వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తెదేపా ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు.

tdp protest
tdp protest

విజయవాడలోని ప్రసాదంపాడు ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాలపై విచారణ చేపట్టాలని, దోషులను శిక్షించాలంటూ ఎక్సైజ్‌ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు వచ్చిన తెదేపా ఎమ్మెల్యేలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం తెదేపా ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడుతో సహా మరికొందరు నేతలను పోలీసులు అరెస్టు చేసి... ఉంగుటూరు, కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు..
నాటుసారా మరణాలపై ఎక్సైజ్‌ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే అరెస్టు చేస్తారా? అని తెదేపా నేతలు ప్రశ్నించారు. అరెస్టులతో ప్రజాఉద్యమాన్ని ఆపలేరని నేతలు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపితే.. అడ్డుకోవటం దారుణమన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా మృతులను సహజ మరణాలుగా చిత్రీకరిస్తారా? సహజ మరణాలంటున్న నేతలు జంగారెడ్డిగూడెం వెళ్లి చూడాలి. నాటుసారా మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే శాసనసభ నుంచి సస్పెండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ప్రకటించాలి. - తెదేపా ఎమ్మెల్యేలు

ప్రసాదంపాడు ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద.. తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు!

ఇదీ చదవండి: నాటుసారా మృతుల కుటుంబాలకు.. తెదేపా పరిహారం అందజేత

విజయవాడలోని ప్రసాదంపాడు ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాలపై విచారణ చేపట్టాలని, దోషులను శిక్షించాలంటూ ఎక్సైజ్‌ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు వచ్చిన తెదేపా ఎమ్మెల్యేలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం తెదేపా ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడుతో సహా మరికొందరు నేతలను పోలీసులు అరెస్టు చేసి... ఉంగుటూరు, కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు..
నాటుసారా మరణాలపై ఎక్సైజ్‌ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే అరెస్టు చేస్తారా? అని తెదేపా నేతలు ప్రశ్నించారు. అరెస్టులతో ప్రజాఉద్యమాన్ని ఆపలేరని నేతలు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపితే.. అడ్డుకోవటం దారుణమన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా మృతులను సహజ మరణాలుగా చిత్రీకరిస్తారా? సహజ మరణాలంటున్న నేతలు జంగారెడ్డిగూడెం వెళ్లి చూడాలి. నాటుసారా మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే శాసనసభ నుంచి సస్పెండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ప్రకటించాలి. - తెదేపా ఎమ్మెల్యేలు

ప్రసాదంపాడు ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద.. తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు!

ఇదీ చదవండి: నాటుసారా మృతుల కుటుంబాలకు.. తెదేపా పరిహారం అందజేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.