ETV Bharat / city

Prof Kodandaram Comments on KCR : 'కేసీఆర్​కు.. ఏ పనికి రాజ్యాంగం అడ్డు వచ్చింది?'

author img

By

Published : Feb 8, 2022, 10:03 AM IST

Prof Kodandaram Comments on KCR : సీఎం కేసీఆర్‌కు రాజ్యాంగం ఆటంకంగా మారుతోందని పలువురు నేతలు, వక్తలు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి అప్రజాస్వామిక ధోరణి బయటపడిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. అందరూ ఒక్కతాటిపై నిలవాలన్నారు.

Prof Kodandaram Comments on KCR
Prof Kodandaram Comments on KCR
కేసీఆర్​కు.. ఏ పనికి రాజ్యాంగం అడ్డు వచ్చింది?

Prof Kodandaram Comments on KCR : రాజ్యాంగంపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు నిరసిస్తూ.. భారత రాజ్యాంగం పరిరక్షణ పేరుతో హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రాజకీయ, ప్రజాసంఘాలు, యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు. కేసీఆర్ నిరంకుశత్వానికి రాజ్యాంగం అడ్డు వస్తోందని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. అందరం కలిసికట్టుగా వ్యతిరేకించకపోతే.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం బతకవంటూ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

'కేసీఆర్ పెత్తనానికి రాజ్యాంగం అడ్డుగా వస్తోంది. ఆయన నిరంకుశత్వానికి ఆటంకంగా కనిపిస్తోంది. ప్రతిపక్షాలపై విచ్చలవిడిగా చేస్తున్న దాడులకు అడ్డుగా కనిపిస్తోంది. అందుకే ఆయన రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.' - కోదండరాం, తెజస అధ్యక్షుడు

Manda Krishna Comments on CM KCR : రాజ్యాంగంలో నిర్దేశించిన అంశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే.. దానిపై పోరాడాలి కానీ పూర్తిగా మార్చాలనడం విడ్డూరమని ఎంఆర్​పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఏడేళ్లలో కేంద్రం తీసుకువచ్చిన చట్టాలు, రాజ్యాంగ సవరణలను తెరాస ఎందుకు సమర్థించిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ తీరు సరిగా లేకుంటే.. పార్లమెంటులో పోరాడాలన్నారు. పాలకులు చేసే ఏ పనికి రాజ్యాంగం అడ్డు వచ్చిందో అర్థం కావడం లేదని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కేంద్రానికి మద్దతు ఇస్తున్నారనే భావన ఇందులో ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

'రాజ్యాంగం స్ఫూర్తి కేసీఆర్​కు నిద్రపట్టకుండా చేస్తోంది. నూతన రాజ్యాంగం తీసుకురావాలన్న కేసీఆర్ వ్యాఖ్యలకు ఇదే నిదర్శనం. రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగకపోతే.. రాష్ట్రం తప్పుబట్టాల్సింది కేంద్రాన్ని.. రాజ్యాంగాన్ని కాదు.' - మందకృష్ణ మాదిగ, ఎంఆర్​పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు

Prof Haragopal About CM KCR : 'ముఖ్యమంత్రి కేసీఆర్.. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. కేసీఆర్ తన పనులకు అడ్డం వస్తోందని రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారు. ఎందుకు మార్చాలో మాత్రం చెప్పడం లేదు.'

- ప్రొఫెసర్ హరగోపాల్

సీఎం కేసీఆర్‌ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నేతలు హెచ్చరించారు.

కేసీఆర్​కు.. ఏ పనికి రాజ్యాంగం అడ్డు వచ్చింది?

Prof Kodandaram Comments on KCR : రాజ్యాంగంపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు నిరసిస్తూ.. భారత రాజ్యాంగం పరిరక్షణ పేరుతో హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రాజకీయ, ప్రజాసంఘాలు, యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు. కేసీఆర్ నిరంకుశత్వానికి రాజ్యాంగం అడ్డు వస్తోందని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. అందరం కలిసికట్టుగా వ్యతిరేకించకపోతే.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం బతకవంటూ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

'కేసీఆర్ పెత్తనానికి రాజ్యాంగం అడ్డుగా వస్తోంది. ఆయన నిరంకుశత్వానికి ఆటంకంగా కనిపిస్తోంది. ప్రతిపక్షాలపై విచ్చలవిడిగా చేస్తున్న దాడులకు అడ్డుగా కనిపిస్తోంది. అందుకే ఆయన రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.' - కోదండరాం, తెజస అధ్యక్షుడు

Manda Krishna Comments on CM KCR : రాజ్యాంగంలో నిర్దేశించిన అంశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే.. దానిపై పోరాడాలి కానీ పూర్తిగా మార్చాలనడం విడ్డూరమని ఎంఆర్​పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఏడేళ్లలో కేంద్రం తీసుకువచ్చిన చట్టాలు, రాజ్యాంగ సవరణలను తెరాస ఎందుకు సమర్థించిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ తీరు సరిగా లేకుంటే.. పార్లమెంటులో పోరాడాలన్నారు. పాలకులు చేసే ఏ పనికి రాజ్యాంగం అడ్డు వచ్చిందో అర్థం కావడం లేదని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కేంద్రానికి మద్దతు ఇస్తున్నారనే భావన ఇందులో ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

'రాజ్యాంగం స్ఫూర్తి కేసీఆర్​కు నిద్రపట్టకుండా చేస్తోంది. నూతన రాజ్యాంగం తీసుకురావాలన్న కేసీఆర్ వ్యాఖ్యలకు ఇదే నిదర్శనం. రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగకపోతే.. రాష్ట్రం తప్పుబట్టాల్సింది కేంద్రాన్ని.. రాజ్యాంగాన్ని కాదు.' - మందకృష్ణ మాదిగ, ఎంఆర్​పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు

Prof Haragopal About CM KCR : 'ముఖ్యమంత్రి కేసీఆర్.. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. కేసీఆర్ తన పనులకు అడ్డం వస్తోందని రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారు. ఎందుకు మార్చాలో మాత్రం చెప్పడం లేదు.'

- ప్రొఫెసర్ హరగోపాల్

సీఎం కేసీఆర్‌ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నేతలు హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.