ETV Bharat / city

మూగ జీవాల రక్షణకు చర్యలు చేపట్టాం: మంత్రి తలసాని - telangana varthalu

రాష్ట్రంలో జీవాలకు మెరుగైన వైద్య సేవలందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. కాంట్రాక్ట్ పద్దతిన గతంలో నియమించిన 75 మంది వైద్యుల పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మంత్రి తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

minister talasani srinivas yadav
మూగ జీవాల రక్షణకు చర్యలు చేపట్టాం: మంత్రి తలసాని
author img

By

Published : May 6, 2021, 3:23 PM IST

రాష్ట్రంలో జీవాలకు మెరుగైన వైద్య సేవలందించాలనేది ప్రభుత్వం లక్ష్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పశుసంవర్ధక శాఖకు గతంలో లేని విధంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని తెలిపారు. అనేక కార్యక్రమాల నిర్వహణ ఫలితంగా ఎంతో గుర్తింపు లభించిందని తెలిపారు. జీవాలకు వైద్య సేవలు అందించడంలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిన గతంలో నియమించిన 75 మంది వైద్యుల పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్ట్ వైద్యుల సేవలు అవసరమని భావించి... 2022 మార్చి 31 వారు విధుల్లో పాల్గొనేలా ఉత్తర్వులను జారీ చేసినట్లు చెప్పారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం సైతం అనేక సందర్భాల్లో ప్రశంసించిందని మంత్రి గుర్తు చేశారు. కేసీఆర్​ ఆదేశాల మేరకు మూగజీవాల వద్దకే వైద్య సేవలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో... నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 సంచార పశు వైద్యశాలలు ప్రారంభించడం జరిగిందని అన్నారు.

జీవాలను రోగాల బారి నుంచి రక్షించేందుకు సకాలంలో టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని పశు వైద్యశాలల్లో జీవాలకు ఆవసరమైన ఔషధాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎప్పటికప్పుడు శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జీవాలకు అందుతున్న వైద్య సేవలు, చర్యలపై సూచనలు ఇస్తూ క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు.

పశుగ్రాసం కొరత ఏర్పడకుండా రైతులకు రాయితీపై గడ్డి విత్తనాల పంపిణీ చేయడం సహా... ఖాళీ స్థలాల్లో ఆరోగ్యకరమైన గడ్డి పెంపకం చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఇవే కాకుండా గొర్రెలు, పశువుల కోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉచితంగా షెడ్లు నిర్మించి ఇస్తున్నామని ప్రస్తావించారు. పశుసంవర్ధక శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు... ఈ శాఖను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తలసాని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 6,026 కరోనా కేసులు, 52మరణాలు

రాష్ట్రంలో జీవాలకు మెరుగైన వైద్య సేవలందించాలనేది ప్రభుత్వం లక్ష్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పశుసంవర్ధక శాఖకు గతంలో లేని విధంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని తెలిపారు. అనేక కార్యక్రమాల నిర్వహణ ఫలితంగా ఎంతో గుర్తింపు లభించిందని తెలిపారు. జీవాలకు వైద్య సేవలు అందించడంలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిన గతంలో నియమించిన 75 మంది వైద్యుల పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్ట్ వైద్యుల సేవలు అవసరమని భావించి... 2022 మార్చి 31 వారు విధుల్లో పాల్గొనేలా ఉత్తర్వులను జారీ చేసినట్లు చెప్పారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం సైతం అనేక సందర్భాల్లో ప్రశంసించిందని మంత్రి గుర్తు చేశారు. కేసీఆర్​ ఆదేశాల మేరకు మూగజీవాల వద్దకే వైద్య సేవలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో... నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 సంచార పశు వైద్యశాలలు ప్రారంభించడం జరిగిందని అన్నారు.

జీవాలను రోగాల బారి నుంచి రక్షించేందుకు సకాలంలో టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని పశు వైద్యశాలల్లో జీవాలకు ఆవసరమైన ఔషధాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎప్పటికప్పుడు శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జీవాలకు అందుతున్న వైద్య సేవలు, చర్యలపై సూచనలు ఇస్తూ క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు.

పశుగ్రాసం కొరత ఏర్పడకుండా రైతులకు రాయితీపై గడ్డి విత్తనాల పంపిణీ చేయడం సహా... ఖాళీ స్థలాల్లో ఆరోగ్యకరమైన గడ్డి పెంపకం చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఇవే కాకుండా గొర్రెలు, పశువుల కోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉచితంగా షెడ్లు నిర్మించి ఇస్తున్నామని ప్రస్తావించారు. పశుసంవర్ధక శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు... ఈ శాఖను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తలసాని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 6,026 కరోనా కేసులు, 52మరణాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.