ETV Bharat / city

వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులకు సెలవుల రద్దు! - commercial tax deportment

వ్యాపార వర్గాల నుంచి పన్ను వసూళ్లు పెంచేందుకు వాణిజ్య పన్నులశాఖ చర్యలు చేపడుతోంది. ఆశించిన స్థాయిలో వసూళ్లు రానందున ఎగవేతదారుల నుంచి పన్నులు రాబట్టేందుకు ఉద్యోగులకు సెలవులు కూడా రద్దు చేశారు.

ఉద్యోగులకు సెలవుల రద్దు
author img

By

Published : Sep 5, 2019, 12:59 PM IST

Updated : Sep 5, 2019, 2:57 PM IST

వాణిజ్య పన్నులశాఖలో ఆశించినంతగా వసూళ్లు లేని కారణంగా ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. గత ఏడాదితో పోలిస్తే 15 నుంచి 20శాతం అధికంగా వసూళ్లు అవుతాయని వేసిన అంచనా తలకిందులైంది. 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 13వేల 700 కోట్లు రాగా... 2019-20 జులై వరకు 14వేల 595కోట్లు వసూలయ్యాయి. దీనికి తోడు జాతీయ వృద్ధిరేటు 9శాతం, తెలంగాణ వృద్ధిరేటు 8.7శాతం మాత్రమే నమోదైంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని, పన్ను ఎగవేతదారుల నుంచి వసూళ్లు పెంచేందుకు ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అనారోగ్య కారణాలుంటే తప్ప సెలవులు ఎవరికీ ఇవ్వొద్దని స్పష్టం చేశారు.

ఉద్యోగులకు సెలవుల రద్దు

ఇదీ చూడండి: సికింద్రాబాద్ కంటోన్మెంటు​పై కేటీఆర్ నజర్

వాణిజ్య పన్నులశాఖలో ఆశించినంతగా వసూళ్లు లేని కారణంగా ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. గత ఏడాదితో పోలిస్తే 15 నుంచి 20శాతం అధికంగా వసూళ్లు అవుతాయని వేసిన అంచనా తలకిందులైంది. 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 13వేల 700 కోట్లు రాగా... 2019-20 జులై వరకు 14వేల 595కోట్లు వసూలయ్యాయి. దీనికి తోడు జాతీయ వృద్ధిరేటు 9శాతం, తెలంగాణ వృద్ధిరేటు 8.7శాతం మాత్రమే నమోదైంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని, పన్ను ఎగవేతదారుల నుంచి వసూళ్లు పెంచేందుకు ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అనారోగ్య కారణాలుంటే తప్ప సెలవులు ఎవరికీ ఇవ్వొద్దని స్పష్టం చేశారు.

ఉద్యోగులకు సెలవుల రద్దు

ఇదీ చూడండి: సికింద్రాబాద్ కంటోన్మెంటు​పై కేటీఆర్ నజర్

TG_HYD_02_05_LEAVS_CANCEL_IN_COMMERCIAL_TAX_AV_3038066 Reporter: Tirupal Reddy ()వాణిజ్య పన్నుల శాఖలో పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో పెరుగుదల లేనికారణంగా ఆ శాఖ శెలవులు రద్దు చేసింది. జిఎస్టీతోపాటు వ్యాట్‌ వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే జులై వరకు నాలుగు నెలల్లో వచ్చిన మొత్తం తీసుకుంటే 2018-19లో రూ. 13,700 కోట్లు రాగా, 2019-20 ఆర్థిక ఏడాదిలో జులై వరకు రూ.14595 కోట్లు రాబడి వచ్చినట్లు వాణిజ్య పనన్నుల శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే ఏప్రిల్‌ నెలలో ఏకంగా అంతకు ముందు ఏడాదిలో వచ్చిన మొత్తం కంటే వెయ్యి కోట్లు అధికంగా వచ్చింది. మే నెలలో కేవలం 5 కోట్లు ఎక్కువ రాగా జూన్‌ నెలలో మూడు వందల కోట్లకుపైగా తక్కువ వచ్చింది. జులై నెలలో కేవలం రెండు వందల కోట్లు అధికంగా వచ్చింది. సాధారణంగా గత ఏడాది వసూళ్లైన మొత్తంపై 15శాతం నుంచి 20శాతం వరకు అధికంగా వస్తుందని అధికారులు అంచనా వేశారు. కాని ఆ స్థాయిలో రాలేదు. దీనికి తోడు జాతీయ వృద్ది రేటు తొమ్మిది శాతం కాగా....తెలంగాణ వృద్ధి రేటు అన్ని పన్నులను బేరీజు వేస్తే 8.7శాతంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పన్నుల ఎగవేతదారుల నుంచి వసూళ్లను పెంచాలని, అనవసరమైన శెలవులు ఇవ్వొద్దని ఉన్నతాధికారులకు వాట్సప్‌ ద్వారా ఆదేశించారు. ఏదైనా అనారోగ్య కారణాలు ఉంటే తప్ప లేకుంటే శెలవులు ఇవ్వడం లేదని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. అధికారులు, సిబ్బంది శెలవులు లేకుండా క్షేత్ర స్థాయిలో వ్యాపారుల లావాదేవీలపై దృష్టి సారిస్తే పన్నుల రాబడిలో పెరుగుదల నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Last Updated : Sep 5, 2019, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.