ETV Bharat / city

గన్నీ సంచులకు పెరిగిన డిమాండ్​... రూ.18 నుంచి 21కి ధర పెంపు

author img

By

Published : Apr 27, 2021, 8:24 PM IST

హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్‌లో 26వ బోర్డు సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలను బోర్డు తీసుకుంది. గన్నీ సంచుల ధర రూ.18 నుంచి 21 రూపాయలకు పెంచింది. రేషన్ డీలర్లకు చెల్లించాల్సిన రూ. 54 కోట్లు విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది.

Gunny bag price hyke from 18 to 21 rupees
Gunny bag price hyke from 18 to 21 rupees

రాష్ట్రంలో ఛౌక ధరల దుకాణాల డీలర్లు పౌరసరఫరాల సంస్థకు అందజేసే గన్నీ సంచుల ధర రూ.18 నుంచి 21 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్‌లో జరిగిన 26వ బోర్డు సమావేశంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు ఈ నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కమీషన్ పెంపునకు సంబంధించి రేషన్ డీలర్లకు చెల్లించాల్సిన రూ. 54 కోట్లు విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది. ప్రతి నెల 87.54 లక్షల కుటుంబాలకు ప్రతి నెల 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. బియ్యం పంపిణీ తర్వాత డీలర్ల దగ్గర ప్రతి నెల 30 లక్షల గన్నీ సంచులు ఉండిపోతున్నాయి. గతంలో ఈ సంచులను డీలర్లు ప్రైవేట్ గన్నీ బ్యాగుల కంట్రాక్టర్లకు అమ్ముకునేవారు.

ప్రతి సంచి సంస్థకే...

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన రైతు సంక్షేమ చర్యల ఫలితంగా పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడులు పెరగడం, పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొనుగోళ్ళు జరుపుతుండటం వల్ల గన్నీ సంచుల వినియోగం భారీగా పెరిగింది. ఈ యాసంగి సీజన్‌లో 9 కోట్ల పాత గన్నీ సంచులు అవసరమవుతాయి. పాత గన్నీ సంచుల వినియోగం పెరగడం వల్ల డీలర్లు కచ్చితంగా గన్నీ బ్యాగులు పౌరసరఫరాల సంస్థకు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆ సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి గన్నీ సంచి సంస్థకే విక్రయించేలా అదనపు కలెక్టర్లు, జిల్లా మేనేజర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

డీలర్ల సమస్యల పరిష్కారం దిశగా...

డీలర్ల న్యాయపరమైన సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటున్న దృష్ట్యా... ఇప్పటి వరకు 6,798 కొనుగోలు కేంద్రాలకు గానూ 4,485 కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులతో పాటు సంబంధిత విభాగాలతో కేంద్ర కార్యాలయం నుంచి తనతో పాటు కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. 77 వేల మంది రైతుల నుంచి 1,211 కోట్ల రూపాయల విలువైన 6.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ప్రకటించారు.

కొనుగోళ్లు ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ ఆ ప్రక్రియ నిలిపేయవద్దని, తాలు, తరుగు సమస్య రాకుండా ప్రతి కేంద్రంలో తప్పనిసరిగా ప్యాడీ క్లీనర్స్ ఉండేలా చర్యలుతీసుకోవాలని మారెడ్డి సూచించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదన్న మంత్రి ఈటల రాజేందర్​

రాష్ట్రంలో ఛౌక ధరల దుకాణాల డీలర్లు పౌరసరఫరాల సంస్థకు అందజేసే గన్నీ సంచుల ధర రూ.18 నుంచి 21 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్‌లో జరిగిన 26వ బోర్డు సమావేశంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు ఈ నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కమీషన్ పెంపునకు సంబంధించి రేషన్ డీలర్లకు చెల్లించాల్సిన రూ. 54 కోట్లు విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది. ప్రతి నెల 87.54 లక్షల కుటుంబాలకు ప్రతి నెల 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. బియ్యం పంపిణీ తర్వాత డీలర్ల దగ్గర ప్రతి నెల 30 లక్షల గన్నీ సంచులు ఉండిపోతున్నాయి. గతంలో ఈ సంచులను డీలర్లు ప్రైవేట్ గన్నీ బ్యాగుల కంట్రాక్టర్లకు అమ్ముకునేవారు.

ప్రతి సంచి సంస్థకే...

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన రైతు సంక్షేమ చర్యల ఫలితంగా పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడులు పెరగడం, పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొనుగోళ్ళు జరుపుతుండటం వల్ల గన్నీ సంచుల వినియోగం భారీగా పెరిగింది. ఈ యాసంగి సీజన్‌లో 9 కోట్ల పాత గన్నీ సంచులు అవసరమవుతాయి. పాత గన్నీ సంచుల వినియోగం పెరగడం వల్ల డీలర్లు కచ్చితంగా గన్నీ బ్యాగులు పౌరసరఫరాల సంస్థకు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆ సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి గన్నీ సంచి సంస్థకే విక్రయించేలా అదనపు కలెక్టర్లు, జిల్లా మేనేజర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

డీలర్ల సమస్యల పరిష్కారం దిశగా...

డీలర్ల న్యాయపరమైన సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటున్న దృష్ట్యా... ఇప్పటి వరకు 6,798 కొనుగోలు కేంద్రాలకు గానూ 4,485 కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులతో పాటు సంబంధిత విభాగాలతో కేంద్ర కార్యాలయం నుంచి తనతో పాటు కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. 77 వేల మంది రైతుల నుంచి 1,211 కోట్ల రూపాయల విలువైన 6.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ప్రకటించారు.

కొనుగోళ్లు ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ ఆ ప్రక్రియ నిలిపేయవద్దని, తాలు, తరుగు సమస్య రాకుండా ప్రతి కేంద్రంలో తప్పనిసరిగా ప్యాడీ క్లీనర్స్ ఉండేలా చర్యలుతీసుకోవాలని మారెడ్డి సూచించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదన్న మంత్రి ఈటల రాజేందర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.