ETV Bharat / city

తాతమ్మల సామగ్రికి ఎనలేని గిరాకీ

author img

By

Published : Jun 23, 2021, 2:42 PM IST

సంప్రదాయాల్ని పాత చింతకాయ పచ్చడంటూ తీసిపడేస్తారు కొందరు. కానీ తాతలనాటి వస్తువులు అమూల్యమని నమ్మిన కార్పొరేట్‌ ఉద్యోగినులు లాభాలపంట పండిస్తున్నారు. ఏమిటా వస్తువులు..? అవి ఎందుకంత ప్రత్యేకం తెలుసుకుందాం పదండి.

etv bharat special stories on ancestral objects
పూర్వికుల వస్తువులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం

మీరా రామకృష్ణన్‌, వారిష్ట సంపత్‌లు కార్పొరేట్‌ రంగంలో ఇరవయ్యేళ్లకు పైగా పనిచేశారు. ఇద్దరూ కొలిగ్స్‌, మంచి స్నేహితులు కూడా. ఉద్యోగం యాంత్రికంగా అనిపించడంతో వ్యాపారం చేయాలనుకున్నారు. వాళ్లకి మరో ఉద్యోగి ఆర్చిష్‌ మాథే మాధవన్‌ తోడయ్యాడు. బాగా ఆలోచించాక... ఇళ్లల్లో ఉపయోగపడేది, గ్రామీణ కళాకారులకు మేలు చేసే వ్యాపారం బాగుంటుందనుకున్నారు. అలా రూపుదిద్దుకున్నదే ‘జిష్టా’. అందులో ఇనుము, ఇత్తడి, మట్టి, రాయి, చెక్కల్లాంటి సహజ ధాతువులతో తయారయ్యే చట్టి, తెపాళా, పెనం, కత్తి లాంటి ప్రాచీన వంటసామాన్లెన్నో.

ఇప్పుడు ‘జిష్టా’ కోసం 450 మంది కళాకారులు పని చేస్తున్నారు. 300 రకాల పాత్రలు తయారవుతున్నాయి. 90 వేల మంది కస్టమర్లున్నారు. దీని వెనుక మీరా, వారిష్టల కృషి చాలానే ఉంది. ఆర్నెళ్లపాటు ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో ఇంటింటికీ తిరిగి సర్వే చేశారు. ఏమేం సాధనాలు ఉండేవో తెలిశాక వాటి నేర్పరులు తమిళనాడులో ఉంటారని తెలిసి కుంబకోణం లాంటి ఊళ్లల్లో గాలించారు. ఒకప్పుడులాంటి పాత్రలకు పట్టం కట్టిన మాట నిజమైనా ఇప్పుడు గిరాకీ లేక మరేవో వృత్తులు చేపట్టారని తెలిసింది. మహారాష్ట్రలో శివాజీ మహారాజుకు ఆయుధాలు తయారుచేసిన కుటుంబం ప్రస్తుతం అలనాటి వంటపాత్రలు తయారు చేస్తోంది. అలా తెలంగాణ, గుజరాత్‌, మణిపూర్‌ లాంటి 14 రాష్ట్రాలు తిరిగారు. అతి కష్టం మీద కొందరు నేర్పరులను దొరికించుకున్నారు. దక్షిణాది వాళ్లకి కాఫీ ప్రాణం కనుక ముందుగా ఇత్తడి కాఫీఫిల్టర్‌ చేసివ్వమని అడిగారు. కానీ ఆ కళ పదేళ్ల క్రితమే అంతరించిందని, అరుదుగా వాడుతున్న ఇత్తడి పాత్రలు యూపీ నుంచి దిగుమతి అవుతున్నాయనీ తెలిసింది. అవీ చేత్తో తయారైనవి కావు. ఇక తమిళనాడు సెంగొట్టాయ్‌ దోశల పెనాలకు ప్రసిద్ధని అక్కడికెళ్లారు. అదృష్టవశాత్తూ ఒక కుటుంబం ఇంకా ఆ పనిలోనే ఉంది. ఒక పెనం తయారీకి అక్షరాలా ఐదున్నర గంటలు పట్టడం చూశారు. చేత్తో తయారయ్యే పనిముట్లు కష్టమైనప్పటికీ ఆరోగ్యానికి మంచిదని శాస్త్రీయంగా రుజువైంది. ఇనుప పాత్రలో వండితే శరీరానికి అవసరమైన ఐరన్‌ అందుతుంది. మట్టి, రాయి, రాగి పాత్రలూ అంతే. ఆయా పాత్రలు ఎక్కువ సంఖ్యలో కావాలంటే ‘అవి అమ్ముడుపోవు, ఖర్చూ శ్రమా రెండూ దండగే’ అన్నారు. వాళ్లని ఒప్పించలేక వేరే వేరే ఊళ్లు తిరిగి మళ్లీమళ్లీ కొన్నారు. అవన్నీ అమ్మి చూపి, వాటికింకా మార్కెట్‌ ఉందని చెప్పాలనుకున్నారు. అమ్మకానికి పెట్టేముందు పాదరసం లాంటి ప్రమాదకరమైన పదార్థాలున్నాయేమో తెలుసుకునేందుకు ప్రయోగశాలకు పంపారు. ‘మేం ఉపయోగించడానికి ఇష్టపడని వాటిని అమ్మదలచుకోలేదు. ఇప్పటికీ ప్రతి పాత్రనీ పరీక్షించిన తర్వాతే వెబ్‌సైట్‌లో పెట్టి ఎలా వాడాలో గైడ్‌లైన్స్‌ ఇస్తాం’ అంటుంది మీరా.

2016లో జిష్టా మొదలైనప్పుడు కుటుంబ సభ్యుల గ్యారేజ్‌నే ఆఫీసుగా చేసుకున్నారు. పాత్రలు నిలవుంచేదీ, ప్యాక్‌ చేసేదీ అక్కడే. ఊహించని విధంగా తెచ్చిన పాత్రలన్నీ మొదటి రోజే అమ్ముడైపోవడంతో ఆనందంతో తబ్బిబ్బయ్యారు. మర్నాడే మళ్లీ ఊళ్లకు బయల్దేరారు. కొద్ది కాలంలోనే దేశంలో వివిధప్రాంతాల నుంచేగాక అమెరికా, కెనడా, అరబ్‌ దేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయి. ఈ వస్తువులకున్న గిరాకీ చూసి కళాకారుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. మరింత సదుపాయంగా, కళాత్మకంగా తయారు చేస్తున్నారు.

ఇదీ చదవండి: కాల గర్భంలో తరువాత కనుమరుగయ్యేది మనిషేనా?

మీరా రామకృష్ణన్‌, వారిష్ట సంపత్‌లు కార్పొరేట్‌ రంగంలో ఇరవయ్యేళ్లకు పైగా పనిచేశారు. ఇద్దరూ కొలిగ్స్‌, మంచి స్నేహితులు కూడా. ఉద్యోగం యాంత్రికంగా అనిపించడంతో వ్యాపారం చేయాలనుకున్నారు. వాళ్లకి మరో ఉద్యోగి ఆర్చిష్‌ మాథే మాధవన్‌ తోడయ్యాడు. బాగా ఆలోచించాక... ఇళ్లల్లో ఉపయోగపడేది, గ్రామీణ కళాకారులకు మేలు చేసే వ్యాపారం బాగుంటుందనుకున్నారు. అలా రూపుదిద్దుకున్నదే ‘జిష్టా’. అందులో ఇనుము, ఇత్తడి, మట్టి, రాయి, చెక్కల్లాంటి సహజ ధాతువులతో తయారయ్యే చట్టి, తెపాళా, పెనం, కత్తి లాంటి ప్రాచీన వంటసామాన్లెన్నో.

ఇప్పుడు ‘జిష్టా’ కోసం 450 మంది కళాకారులు పని చేస్తున్నారు. 300 రకాల పాత్రలు తయారవుతున్నాయి. 90 వేల మంది కస్టమర్లున్నారు. దీని వెనుక మీరా, వారిష్టల కృషి చాలానే ఉంది. ఆర్నెళ్లపాటు ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో ఇంటింటికీ తిరిగి సర్వే చేశారు. ఏమేం సాధనాలు ఉండేవో తెలిశాక వాటి నేర్పరులు తమిళనాడులో ఉంటారని తెలిసి కుంబకోణం లాంటి ఊళ్లల్లో గాలించారు. ఒకప్పుడులాంటి పాత్రలకు పట్టం కట్టిన మాట నిజమైనా ఇప్పుడు గిరాకీ లేక మరేవో వృత్తులు చేపట్టారని తెలిసింది. మహారాష్ట్రలో శివాజీ మహారాజుకు ఆయుధాలు తయారుచేసిన కుటుంబం ప్రస్తుతం అలనాటి వంటపాత్రలు తయారు చేస్తోంది. అలా తెలంగాణ, గుజరాత్‌, మణిపూర్‌ లాంటి 14 రాష్ట్రాలు తిరిగారు. అతి కష్టం మీద కొందరు నేర్పరులను దొరికించుకున్నారు. దక్షిణాది వాళ్లకి కాఫీ ప్రాణం కనుక ముందుగా ఇత్తడి కాఫీఫిల్టర్‌ చేసివ్వమని అడిగారు. కానీ ఆ కళ పదేళ్ల క్రితమే అంతరించిందని, అరుదుగా వాడుతున్న ఇత్తడి పాత్రలు యూపీ నుంచి దిగుమతి అవుతున్నాయనీ తెలిసింది. అవీ చేత్తో తయారైనవి కావు. ఇక తమిళనాడు సెంగొట్టాయ్‌ దోశల పెనాలకు ప్రసిద్ధని అక్కడికెళ్లారు. అదృష్టవశాత్తూ ఒక కుటుంబం ఇంకా ఆ పనిలోనే ఉంది. ఒక పెనం తయారీకి అక్షరాలా ఐదున్నర గంటలు పట్టడం చూశారు. చేత్తో తయారయ్యే పనిముట్లు కష్టమైనప్పటికీ ఆరోగ్యానికి మంచిదని శాస్త్రీయంగా రుజువైంది. ఇనుప పాత్రలో వండితే శరీరానికి అవసరమైన ఐరన్‌ అందుతుంది. మట్టి, రాయి, రాగి పాత్రలూ అంతే. ఆయా పాత్రలు ఎక్కువ సంఖ్యలో కావాలంటే ‘అవి అమ్ముడుపోవు, ఖర్చూ శ్రమా రెండూ దండగే’ అన్నారు. వాళ్లని ఒప్పించలేక వేరే వేరే ఊళ్లు తిరిగి మళ్లీమళ్లీ కొన్నారు. అవన్నీ అమ్మి చూపి, వాటికింకా మార్కెట్‌ ఉందని చెప్పాలనుకున్నారు. అమ్మకానికి పెట్టేముందు పాదరసం లాంటి ప్రమాదకరమైన పదార్థాలున్నాయేమో తెలుసుకునేందుకు ప్రయోగశాలకు పంపారు. ‘మేం ఉపయోగించడానికి ఇష్టపడని వాటిని అమ్మదలచుకోలేదు. ఇప్పటికీ ప్రతి పాత్రనీ పరీక్షించిన తర్వాతే వెబ్‌సైట్‌లో పెట్టి ఎలా వాడాలో గైడ్‌లైన్స్‌ ఇస్తాం’ అంటుంది మీరా.

2016లో జిష్టా మొదలైనప్పుడు కుటుంబ సభ్యుల గ్యారేజ్‌నే ఆఫీసుగా చేసుకున్నారు. పాత్రలు నిలవుంచేదీ, ప్యాక్‌ చేసేదీ అక్కడే. ఊహించని విధంగా తెచ్చిన పాత్రలన్నీ మొదటి రోజే అమ్ముడైపోవడంతో ఆనందంతో తబ్బిబ్బయ్యారు. మర్నాడే మళ్లీ ఊళ్లకు బయల్దేరారు. కొద్ది కాలంలోనే దేశంలో వివిధప్రాంతాల నుంచేగాక అమెరికా, కెనడా, అరబ్‌ దేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయి. ఈ వస్తువులకున్న గిరాకీ చూసి కళాకారుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. మరింత సదుపాయంగా, కళాత్మకంగా తయారు చేస్తున్నారు.

ఇదీ చదవండి: కాల గర్భంలో తరువాత కనుమరుగయ్యేది మనిషేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.