ఎగ్జిట్ పోల్స్ తీర్పు- మహాకూటమిదే బిహార్
బిహార్ ఎన్నికల్లో మహాకూటమికే మొగ్గు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి మహాకూటమిగా బిహార్ బరిలోకి దిగగా.. ఆ కూటమికే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముందని... పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
దీపావళికి బోనస్
సింగరేణి యాజమాన్యం కార్మికులకు శుభవార్త అందించింది. ఏటా మాదిరే దీపావళి బోనస్తో ఈసారి సింగరేణి కార్మికులు పండుగ చేసుకోనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఎంత పంపిణీ చేశారు
కూకట్పల్లి జోన్ పరిధిలో వరద బాధితులకు ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఎంత పంపిణీ చేశారనే వివరాలను తనకు రాత పూర్వకంగా ఇవ్వాలని జోనల్ కమిషనర్ మమతను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఆబ్కారీశాఖ అధికారిని నిర్భందించిన ఆదివాసీలు
కుమురంభీం జిల్లా జైనూరు లెండిగూడలో ఆబ్కారీశాఖ అధికారులను ఆదివాసీలు నిర్బంధించారు. మద్యం సేవించి.. తమ ఆచారాలకు విరుద్ధంగా బుట్లు వేసుకుని.. మగవారు లేని సమయంలో ఇళ్లల్లో అధికారులు తనిఖీలు నిర్వహించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
నెరవేరిన 30ఏళ్ల కల
ఆడపిల్ల పుట్టిందని కొందరు కర్కశత్వం చూపిస్తున్న ఈ కాలంలో ఓ దంపతులు మాత్రం అమ్మాయి పుట్టాలని 30 ఏళ్లు ఎదురుచూశారు. అయితే దాదాపు 14 మంది మగపిల్లల తర్వాత 15వ సంతానంగా ఆడశిశువు జన్మించడం వల్ల వారి ఆనందానికి అవధుల్లేవు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
10న మోదీ.. జిన్పింగ్ ముఖాముఖీ!
భారత్-చైనా సరిహద్దు ఘర్షణల తర్వాత మోదీ, జిన్పింగ్ తొలిసారి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబరు 10న జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) వార్షిక సదస్సులో ఇరు దేశాధినేతలు ఆన్లైన్ ద్వారా ముఖాముఖీ చర్చలో పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నితిశ్ను దాటేసిన తేజస్వీ
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. బిహార్ ఎన్నికల ప్రచారాల్లో దూసుకుపోయారు. మహాకూటమి సీఎం అభ్యర్థిగా 247 సభల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్.. 160కుపైగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఎగుమతుల్లో భారీ పెరుగుదల!
ఓ వైపు కరోనా వైరస్ విజృంభించి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తుతున్న సమయంలో చైనా దూసుకెళుతోంది. అక్టోబర్లో డ్రాగన్ ఎగుమతులు 11.4 శాతం వృద్ధితో 237.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఊహించలేదు
శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుపై హైదరాబాద్ విజయం సాధించింది. టైటిల్ రేసులో నిలిచింది. దీనిపై మాజీలు పలు రకాలుగా స్పందిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
అలాంటి అబ్బాయిలంటే చాలా ఇష్టం
నటిగా, యాంకర్గా అలరిస్తున్న శ్రీముఖి.. తనకు మాస్ అబ్బాయిలంటే ఇష్టమని చెప్పింది. వీటితోపాటే పలు ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.