ETV Bharat / city

ఈ గుడిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే తెరుస్తారు.. ఎందుకంటే?

author img

By

Published : Mar 1, 2022, 7:01 PM IST

kedareshwar Temple: సాధారణంగా దేవాలయాలు ఏడాది పాటు తెరుచుకుని ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఆలయాన్ని తెరిచి భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తారు. ఇలా ఎందుకు జరుగుతుందో, దీని విశిష్టత ఏమిటో తెలుసుకుందామా?

kedareshwar temple specialty
kedareshwar temple specialty

kedareshwar Temple: ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనం లభించే అతి ప్రాచీనమైన శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయంలో మహాదేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ దేవాలయం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఉంది. మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా.. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి.. స్వామివారికి అభిషేకాలు చేశారు.

ఆలయ చరిత్ర

తూర్పు చాళుక్యుల కాలంలో బిక్కవోలు గ్రామంలోని గోలింగేశ్వర స్వామి గ్రామంలోని నలుదిక్కుల నాలుగు శివాలయాలు నిర్మించారు. వాటిలో ఒకటైన జైన దేవాలయంలో కేదారేశ్వరుడు కొలువై ఉన్నాడు. అప్పుడు జరిగిన యుద్ధాలలో ఈ ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడంతో ఆలయం మూతపడింది. తిరిగి ఆలయాన్ని తెరిచి సంవత్సరానికి ఒక రోజు మాత్రమే, అదీ మహా శివరాత్రి పర్వదినాన మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా వేకువజాము నుంచే స్వామివారిని దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం కిటకిటలాడుతోంది.

ఈ గుడిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే తెరుస్తారు...

ఇదీచూడండి: ఆ గ్రామంలో శివుడి మహిమ.. దర్శనమిచ్చిన నాగన్న.. వీడియో వైరల్​..

kedareshwar Temple: ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనం లభించే అతి ప్రాచీనమైన శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయంలో మహాదేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ దేవాలయం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఉంది. మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా.. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి.. స్వామివారికి అభిషేకాలు చేశారు.

ఆలయ చరిత్ర

తూర్పు చాళుక్యుల కాలంలో బిక్కవోలు గ్రామంలోని గోలింగేశ్వర స్వామి గ్రామంలోని నలుదిక్కుల నాలుగు శివాలయాలు నిర్మించారు. వాటిలో ఒకటైన జైన దేవాలయంలో కేదారేశ్వరుడు కొలువై ఉన్నాడు. అప్పుడు జరిగిన యుద్ధాలలో ఈ ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడంతో ఆలయం మూతపడింది. తిరిగి ఆలయాన్ని తెరిచి సంవత్సరానికి ఒక రోజు మాత్రమే, అదీ మహా శివరాత్రి పర్వదినాన మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా వేకువజాము నుంచే స్వామివారిని దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం కిటకిటలాడుతోంది.

ఈ గుడిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే తెరుస్తారు...

ఇదీచూడండి: ఆ గ్రామంలో శివుడి మహిమ.. దర్శనమిచ్చిన నాగన్న.. వీడియో వైరల్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.