ETV Bharat / city

ప్రభుత్వం ప్రకటన చేసింది.. జనం బారులు తీరారు..

author img

By

Published : Oct 24, 2020, 2:05 PM IST

బహిరంగ మర్కెట్​లో కిలో ధర దాదాపు రూ.90 పలుకుతోంది. దీంతో ధరలు నియత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కిలో ఉల్లి రూ.35లకే నగరంలోని రైతు బజార్ల విక్రయించేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ ప్రకటన రాగానే... ప్రజలు రైతు బజార్ల ముందు బారులు తీరారు.

customers heavy que lines infront of erragadda rithubazar for onions
ఉల్లిగడ్డ కోసం ఎర్రగడ్డ రైతు బజారు ముందు బారులు

ఉల్లిగడ్డ ధర బహిరంగ మార్కెట్​లో రూ.90లకుపైగా పలుకుతున్నందున... రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందించేందుకు నిర్ణయించింది. హైదరాబాద్​లోని రైతు బజార్లలో సబ్సిడీ ధరకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేసింది. నగరంలోని 11 రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కు సరఫరా చేపట్టింది.

పండుగ సమయం కావడంతో ప్రభుత్వ ప్రకటన రాగానే.. ప్రజలు రైతు బజార్ల ముందు బారులు తీరారు. ఎర్రగడ్డ రైతు బజార్​ వద్ద మధ్యాహ్నానికే పెద్ద క్యూలైను కనిపించింది. కిలో రూ.35కు ఒక వ్యక్తికి రెండు కిలోలు చొప్పున ఇస్తున్నారు. గుర్తింపు కోసం ఆధార్​, ఓటర్​ కార్డు వంటి ఏదైనా తీసుకురావాలని ప్రభుత్వం సూచించింది. ఒక వ్యక్తికి రెండు కిలోల నిబంధన ఉన్నందున... ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు కూడా లైను రైతు బజార్ల ముందు నిలబడ్డారు.

ఉల్లిగడ్డ ధర బహిరంగ మార్కెట్​లో రూ.90లకుపైగా పలుకుతున్నందున... రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందించేందుకు నిర్ణయించింది. హైదరాబాద్​లోని రైతు బజార్లలో సబ్సిడీ ధరకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేసింది. నగరంలోని 11 రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కు సరఫరా చేపట్టింది.

పండుగ సమయం కావడంతో ప్రభుత్వ ప్రకటన రాగానే.. ప్రజలు రైతు బజార్ల ముందు బారులు తీరారు. ఎర్రగడ్డ రైతు బజార్​ వద్ద మధ్యాహ్నానికే పెద్ద క్యూలైను కనిపించింది. కిలో రూ.35కు ఒక వ్యక్తికి రెండు కిలోలు చొప్పున ఇస్తున్నారు. గుర్తింపు కోసం ఆధార్​, ఓటర్​ కార్డు వంటి ఏదైనా తీసుకురావాలని ప్రభుత్వం సూచించింది. ఒక వ్యక్తికి రెండు కిలోల నిబంధన ఉన్నందున... ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు కూడా లైను రైతు బజార్ల ముందు నిలబడ్డారు.

ఇదీ చూడండి: భాగ్యనగరంలో కిలో ఉల్లి 35 రూపాయలే...: మంత్రి నిరంజన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.