ETV Bharat / city

Covid effect on schools: ఒక్క రోజే 10 మంది ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ బోధకురాలికి కొవిడ్‌

author img

By

Published : Sep 5, 2021, 6:47 AM IST

పాఠశాలలు పునఃప్రారంభమైన రెండు మూడు రోజుల్లోనే ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. శనివారం ఒక్క రోజే వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పది మంది ఉపాధ్యాయులు, ఓ అంగన్‌వాడీ కేంద్రం బోధకురాలికి, నాలుగో తరగతి విద్యార్థినికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోనళ చెందుతున్నారు.

Covid:
కరోనా

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. శనివారం ఒక్క రోజే వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పది మంది ఉపాధ్యాయులు, ఓ అంగన్‌వాడీ కేంద్రం బోధకురాలికి, నాల్గో తరగతి విద్యార్థినికి కరోనా నిర్ధారణ అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. టేకులపల్లి మండలం తొమ్మిదో మైలుతండా యూపీఎస్‌కు చెందిన ఓ ఉపాధ్యాయురాలు, ఇదే మండలం కోయగూడెం అంగన్‌వాడీ కేంద్రం బోధకురాలికి కరోనా నిర్ధారణ అయింది.

పినపాక మండలం పోతురెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు, కరకగూడెం మండలం వెంకటాపురం గిరిజన ప్రాథమిక పాఠశాల, దమ్మపేట మండలం రంగువారిగూడెం ప్రాథమిక పాఠశాల, జూలురుపాడు మండలం పాపకొల్లు ఉన్నత పాఠశాలకు చెందిన ఒక్కో ఉపాధ్యాయుడు చొప్పున కొవిడ్‌బారిన పడ్డారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకిట్యాతండా యూపీఎస్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి పాజిటివ్‌గా తేలింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడితోపాటు రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఇర్విన్‌ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆయన భార్యకు కూడా శనివారం కరోనా నిర్ధారణ అయింది.

నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని బాహర్‌పేట జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడికీ పాజిటివ్‌ వచ్చింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికీ వైరస్‌ సోకింది. ఇదిలా ఉండగా.. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు కొవిడ్‌ బారినపడినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. గత గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, శుక్రవారం మరో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా నిర్ధారణ అయినట్లు యాదగిరిగుట్ట ఎంఈవో వంశీకృష్ణ శనివారం వెల్లడించారు. ఉపాధ్యాయులకు కరోనా సోకిందని తెలియగానే ఆయా పాఠశాలల్లోని విద్యార్థులు, మిగతా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి శనివారం పరీక్షలు చేయించారు. వారందరికీ నెగెటివ్‌ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

రాష్ట్రంలో 306 కరోనా కేసులు

రాష్ట్రంలో శనివారం కొత్తగా 306 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో మరో ముగ్గురు మృతి చెందారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 69,422 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 78, కరీంనగర్‌ జిల్లాలో 31, హనుమకొండ జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి. మరో 1.71 లక్షల టీకాలు పంపిణీ చేశారు.

100% టీకా’ బ్యానర్లు పెట్టండి: సీఎస్‌

విద్యా సంస్థల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందితోపాటు 18 ఏళ్లు నిండిన విద్యార్థులందరికీ కరోనా టీకాలు తప్పనిసరిగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. వంద శాతం టీకాలు వేయించుకుంటే అదే విషయాన్ని పేర్కొంటూ విద్యా సంస్థల్లో బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, విద్యాసంస్థల అధిపతులు ఆయా పీహెచ్‌సీ వైద్యాధికారులతో అర్హులైన వారికి టీకాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 10వ తేదీలోగా విద్యా సంస్థల్లో అర్హులైన 100 శాతం మందికి టీకాలు ఇచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. '

ఇదీ చదవండి: kcr meet amitshah: ఐపీఎస్‌ క్యాడర్‌ పోస్టులు పెంచండి.. అమిత్​షాకు సీఎం వినతి

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. శనివారం ఒక్క రోజే వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పది మంది ఉపాధ్యాయులు, ఓ అంగన్‌వాడీ కేంద్రం బోధకురాలికి, నాల్గో తరగతి విద్యార్థినికి కరోనా నిర్ధారణ అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. టేకులపల్లి మండలం తొమ్మిదో మైలుతండా యూపీఎస్‌కు చెందిన ఓ ఉపాధ్యాయురాలు, ఇదే మండలం కోయగూడెం అంగన్‌వాడీ కేంద్రం బోధకురాలికి కరోనా నిర్ధారణ అయింది.

పినపాక మండలం పోతురెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు, కరకగూడెం మండలం వెంకటాపురం గిరిజన ప్రాథమిక పాఠశాల, దమ్మపేట మండలం రంగువారిగూడెం ప్రాథమిక పాఠశాల, జూలురుపాడు మండలం పాపకొల్లు ఉన్నత పాఠశాలకు చెందిన ఒక్కో ఉపాధ్యాయుడు చొప్పున కొవిడ్‌బారిన పడ్డారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకిట్యాతండా యూపీఎస్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి పాజిటివ్‌గా తేలింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడితోపాటు రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఇర్విన్‌ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆయన భార్యకు కూడా శనివారం కరోనా నిర్ధారణ అయింది.

నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని బాహర్‌పేట జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడికీ పాజిటివ్‌ వచ్చింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికీ వైరస్‌ సోకింది. ఇదిలా ఉండగా.. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు కొవిడ్‌ బారినపడినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. గత గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, శుక్రవారం మరో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా నిర్ధారణ అయినట్లు యాదగిరిగుట్ట ఎంఈవో వంశీకృష్ణ శనివారం వెల్లడించారు. ఉపాధ్యాయులకు కరోనా సోకిందని తెలియగానే ఆయా పాఠశాలల్లోని విద్యార్థులు, మిగతా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి శనివారం పరీక్షలు చేయించారు. వారందరికీ నెగెటివ్‌ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

రాష్ట్రంలో 306 కరోనా కేసులు

రాష్ట్రంలో శనివారం కొత్తగా 306 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో మరో ముగ్గురు మృతి చెందారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 69,422 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 78, కరీంనగర్‌ జిల్లాలో 31, హనుమకొండ జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి. మరో 1.71 లక్షల టీకాలు పంపిణీ చేశారు.

100% టీకా’ బ్యానర్లు పెట్టండి: సీఎస్‌

విద్యా సంస్థల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందితోపాటు 18 ఏళ్లు నిండిన విద్యార్థులందరికీ కరోనా టీకాలు తప్పనిసరిగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. వంద శాతం టీకాలు వేయించుకుంటే అదే విషయాన్ని పేర్కొంటూ విద్యా సంస్థల్లో బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, విద్యాసంస్థల అధిపతులు ఆయా పీహెచ్‌సీ వైద్యాధికారులతో అర్హులైన వారికి టీకాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 10వ తేదీలోగా విద్యా సంస్థల్లో అర్హులైన 100 శాతం మందికి టీకాలు ఇచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. '

ఇదీ చదవండి: kcr meet amitshah: ఐపీఎస్‌ క్యాడర్‌ పోస్టులు పెంచండి.. అమిత్​షాకు సీఎం వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.