ETV Bharat / city

రాజధాని ఏర్పాటు మా పరిధిలోనిది కాదు: కేంద్రం

ఏపీ రాజధాని అమరావతి అంశంపై కేంద్రం ప్రభుత్వం మరోసారి స్పందించింది . పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దుపై ఏపీ హైకోర్టు ఇచ్చిన నోటీసులపై వివరణ ఇస్తూ... రాజధాని ఏర్పాటు అంశం తమ పరిధిలోనిది కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరపున హోంశాఖ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

author img

By

Published : Aug 19, 2020, 4:51 PM IST

రాజధాని ఏర్పాటు మా పరిధిలోనిది కాదు: కేంద్రం
రాజధాని ఏర్పాటు మా పరిధిలోనిది కాదు: కేంద్రం

ఆంధ్రప్రదేశ్​లో పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు విషయంలో హైకోర్టు జారీ చేసిన నోటీసులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో కేంద్రం మరోసారి కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ చట్టం రద్దు నిర్ణయాల అంశంలో దోనె సాంబశివరావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ అండర్‌ సెక్రటరీ లలిత అఫిడవిట్‌ దాఖలు చేశారు. 2014 ఏప్రిల్‌ 23న అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా పేర్కొందని.. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 94 ప్రకారం రాజధాని అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేసిందని అందులో తెలిపారు.

రాజధాని నిర్ణయించుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పాత్రలేదని.. తమ రాజధానులను నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్ర సమగ్ర ప్రాంతాల అభివృద్ధి 2020 చట్టం రూపకల్పన విషయాన్ని రాష్ట్రప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకురాలేదని అఫిడవిట్‌లో పేర్కొంది. చట్టాలు చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఈనెల 14న పేర్కొన్న అంశాలనే తాజాగా కేంద్రం పునరుద్ఘాటించింది.

ఆంధ్రప్రదేశ్​లో పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు విషయంలో హైకోర్టు జారీ చేసిన నోటీసులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో కేంద్రం మరోసారి కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ చట్టం రద్దు నిర్ణయాల అంశంలో దోనె సాంబశివరావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ అండర్‌ సెక్రటరీ లలిత అఫిడవిట్‌ దాఖలు చేశారు. 2014 ఏప్రిల్‌ 23న అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా పేర్కొందని.. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 94 ప్రకారం రాజధాని అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేసిందని అందులో తెలిపారు.

రాజధాని నిర్ణయించుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పాత్రలేదని.. తమ రాజధానులను నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్ర సమగ్ర ప్రాంతాల అభివృద్ధి 2020 చట్టం రూపకల్పన విషయాన్ని రాష్ట్రప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకురాలేదని అఫిడవిట్‌లో పేర్కొంది. చట్టాలు చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఈనెల 14న పేర్కొన్న అంశాలనే తాజాగా కేంద్రం పునరుద్ఘాటించింది.

ఇదీ చదవండి

ఊపిరి పీల్చుకుంటున్న ముంపు గ్రామాల ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.