సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తున్నట్టు స్థానిక ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని కార్ఖానాలో నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొంతకాలంగా అభివృద్ధి పనులతో కంటోన్మెంట్ పరుగులు పెడుతోందని పేర్కొన్నారు.
కమ్యూనిటీ హాల్ కోసం అవసరమైతే ఎమ్మెల్యే నిధుల నుంచి పది లక్షలు కేటాయిస్తానన్నారు. ఈ భవనం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ అనితా ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ట్రామాకేర్ సెంటర్గా శామీర్పేట్ ఆస్పత్రి : ఈటల