ETV Bharat / city

ఏపీలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. తాజాగా 9999 కేసులు

author img

By

Published : Sep 11, 2020, 6:36 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా మహమ్మారి వాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 9,999 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. 77 మంది మరణించారు. ఇప్పటివరకు 5,47,686 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తంగా కరోనా మహమ్మారితో 4,779 మంది చనిపోయారు.

ఏపీలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. తాజాగా 9999 కేసులు
ఏపీలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. తాజాగా 9999 కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 9,999 కొవిడ్ పాజిటివ్​ కేసులు నమోదు కాగా 77 మంది మరణించారు. ఇప్పటివరకు వైరస్ బాధితుల సంఖ్య 5,47,686కి చేరింది. మొత్తం మీద కరోనా మహమ్మారితో 4,779 మంది చనిపోయారు.

96,191 యాక్టివ్ కేసులు...

రాష్ట్రంలో ప్రస్తుతం 96,191 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 11,069 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో కోలుకున్నా వారి సంఖ్య 4,46,716కు చేరుకుంది.

ఏపీలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. తాజాగా 9999 కేసులు
ఏపీలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. తాజాగా 9999 కేసులు

71,137 పరీక్షలు...

గడిచిన 24 గంటల్లో 71,137 కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం ఇప్పటివరకు 44,52,128 కరోనా పరీక్షలు చేపట్టారు.

జిల్లాలవారీగా కేసులు..

అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాగా తూర్పుగోదావరి జిల్లా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 1,499 కరోనా కేసులు నమోదయ్యాయి. ప.గో. జిల్లాలో 1,081, చిత్తూరులో 1,040, గుంటూరులో 920, ప్రకాశంలో 901, నెల్లూరులో 778, కడపలో 698, విజయనగరంలో 594, శ్రీకాకుళంలో 570, అనంతపురంలో 557, కర్నూలులో 497, కృష్ణాలో 451, విశాఖలో 413 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.

జిల్లాల వారీగా మృతులు..

గడిచిన 24 గంటల్లో మహమ్మారితో కడపలో 9 మంది చనిపోయారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. గుంటూరు 7, కృష్ణా జిల్లాల్లో ఏడుగురు, అనంతపురం, విశాఖ జిల్లాల్లో ఆరుగురు చొప్పున, విజయనగరం, ప.గో. జిల్లాల్లో ఐదుగురు, తూ.గో. జిల్లాలో నలుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు.

ఇవీ చూడండి : కొత్త రెవెన్యూ చట్టంపై సీఎల్పీ నేత భట్టి, సీఎం కేసీఆర్ వాదనలు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 9,999 కొవిడ్ పాజిటివ్​ కేసులు నమోదు కాగా 77 మంది మరణించారు. ఇప్పటివరకు వైరస్ బాధితుల సంఖ్య 5,47,686కి చేరింది. మొత్తం మీద కరోనా మహమ్మారితో 4,779 మంది చనిపోయారు.

96,191 యాక్టివ్ కేసులు...

రాష్ట్రంలో ప్రస్తుతం 96,191 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 11,069 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో కోలుకున్నా వారి సంఖ్య 4,46,716కు చేరుకుంది.

ఏపీలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. తాజాగా 9999 కేసులు
ఏపీలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. తాజాగా 9999 కేసులు

71,137 పరీక్షలు...

గడిచిన 24 గంటల్లో 71,137 కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం ఇప్పటివరకు 44,52,128 కరోనా పరీక్షలు చేపట్టారు.

జిల్లాలవారీగా కేసులు..

అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాగా తూర్పుగోదావరి జిల్లా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 1,499 కరోనా కేసులు నమోదయ్యాయి. ప.గో. జిల్లాలో 1,081, చిత్తూరులో 1,040, గుంటూరులో 920, ప్రకాశంలో 901, నెల్లూరులో 778, కడపలో 698, విజయనగరంలో 594, శ్రీకాకుళంలో 570, అనంతపురంలో 557, కర్నూలులో 497, కృష్ణాలో 451, విశాఖలో 413 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.

జిల్లాల వారీగా మృతులు..

గడిచిన 24 గంటల్లో మహమ్మారితో కడపలో 9 మంది చనిపోయారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. గుంటూరు 7, కృష్ణా జిల్లాల్లో ఏడుగురు, అనంతపురం, విశాఖ జిల్లాల్లో ఆరుగురు చొప్పున, విజయనగరం, ప.గో. జిల్లాల్లో ఐదుగురు, తూ.గో. జిల్లాలో నలుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు.

ఇవీ చూడండి : కొత్త రెవెన్యూ చట్టంపై సీఎల్పీ నేత భట్టి, సీఎం కేసీఆర్ వాదనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.